Friday

'షాడో'లో మరో కథానాయికగా నిఖిత


 వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలుసు. 'షాడో' పేరుతో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో వెంకటేష్ పక్కన తాప్సీ, మరో హీరో శ్రీకాంత్ పక్కన మధురిమ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నిఖిత తాజాగా ఎంపికైంది. ఈమె వెంకటేష్ సరసన రెండో కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభించుకునే ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ గా నటిస్తున్నారు.

0 comments:

Post a Comment