Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Sunday

‘ఉద్యోగుల వైద్యం’..కార్పొరేట్‌కు నైవేద్యం...!

‘ఉద్యోగుల వైద్యం’..కార్పొరేట్‌కు నైవేద్యం...!


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెైద్యం అందించ డ మంటే కార్పొరేట్‌ ఆసుపత్రులకు పం డగే. వారికి ఇష్టమైన బిల్లులు వేసుకోవ చ్చు. నకిలీ బిల్లులతో లక్షలకు లక్షలు కొ ట్టేయవచ్చు. అప్పనంగా ప్రభుత్వ సొ మ్మును దిగమింగవచ్చు. అందుకే తమ ఆసుపత్రుల్లో సీజీహెచ్‌ఎస్‌ సౌకర్యం ఉం దంటూ భారీగా ప్రచారం చేసుకుని మరీ పేషెంట్లను రారమ్మని కార్పొరేట్‌ ఆసుప త్రులు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగుల కు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉందం టూ బురిడీ కొట్టిస్తున్నాయి. లక్షలకు లక్షల బిల్లులను అప్పనంగా సొమ్ము చేసుకుం టున్నాయి. రాష్ట్రంలోని కార్పొరేట్‌ ఆసు పత్రు ల్లో సీజీహెచ్‌ఎస్‌ కేసుల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఫిర్యాదులపెై హైదరాబా ద్‌లోని మూడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను సొంతం చేసుకున్నా ఇంతవరకు వాటిపెై ఎలాం టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ప్రజా ప్రతినిధుల అండ ఉంటే ఇలాంటి కేసులేవీ తమకు అడ్డుకావన్న ధీమా తో వారు తమ పని కానిచ్చేస్తున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి సిబిఐ విచారణ వేగవంతం కాకుండా ఇప్పటికే కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు పావులు కదిపిన ట్లు సమాచారం. సీబీఐ అధికారులు కార్పొరే ట్‌ ఆసుపత్రుల అవకతవకలపెై విచారణలతో సరిపెట్టి చర్యలు తీసుకోలేదు. చిన్న చిన్న కేసు ల్లో తమ ప్రతాపం చూపుతున్న స్రీబీఐ ప్రజా రోగ్యంతో చెలగాటమాడుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాకంపెై దృష్టి చూపకపోవడం పెైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానం గా గుండె మార్పిడి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, కేన్సర్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి కేసుల్లో ఎక్కువగా నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. చిన్న ఆపరేషన్లను నిర్వహించిన ప్పటికీ లక్షల రూపాయల్లో బిల్లులను వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

వెైద్య పరికరాల్లోనూ గోల్‌మాల్‌
గుండెకు సంబంధించిన శస్తచ్రికిత్సలను నిర్వహించిన సమయంలో రోగులకు అవస రం లేకున్నా స్టెంట్లను వేసి బిల్లులు వసూలు చేసిన ఆరోపణలు సైతం కార్పొరేట్‌ ఆసుపత్రులపెై ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ రోగులకు అందిస్తున్నామన్న కారణం చూపి మరింత అదనంగా సొమ్ము చేసుకుంటున్నాయి. వాస్తవంగా నాసిరకం స్టంట్స్‌ను ఆరోగ్య శ్రీ రోగులకు వేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఒక్కసారి ఆసుపత్రికి రోగి వచ్చిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లే వరకూ వారి ఆధీనంలో వారు చెప్పినట్లు తలూపాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. 

ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెంట్లు
కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రప్పించుకోవడానికి పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రైవేటు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారు తమ ఆసుపత్రుల కు ఎన్ని కేసులు తీసుకువస్తే వాటిని లెక్కకట్టి మరీ వారికి కమీషన్లు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ తోపాటు విజయవాడ, విశాఖప ట్నం, తిరుపతి, వరంగల్‌ వంటి ప్రధాన నగరాల్లో సైతం వీరు తమ కార్యకలాపాలకు నిర్వహిస్తున్నారు. భారీగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వెైద్యం అంటూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తతంగంపెై సీబీఐ ఇప్పటికైనా దృష్టి సారించి వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read more >>

వికీలీక్స్‌ను వేటాడడం ఆపండి

ఒబామాకు అసాంజే హితవు
లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీ బాల్కనీ నుంచి ప్రసంగం
మద్దతుదారులకు కృతజ్ఞతలు

 
‘వీకీలీక్స్‌ను వెంటాడడం, వేధించడం ఆపండి.. అధ్యక్షుడు ఒబామా మంచి పని చేయాలని కోరుతున్నా’ అని వికీలీక్స్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే.. అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామాకు హి తవు పలికారు. రెండు నెలలుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న అసాంజే తొలిసారి ఆది వారం బహిరంగంగా మాట్లాడారు. లేత నీలి చొక్కా, ఎరుపు టై ధరించిన అసాంజే ఎంబసీ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ బాల్కనీ నుంచి ప్రపంచ మీడియా, మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. ఓపక్క.. తాను బయటకొ స్తే అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్న వందమంది పోలీ సు అధికారులు, అక్కడి ప్రతి కదలికపై నిఘా కోసం గగనతలంతో హెలికాప్టర్.. మరోపక్క 200 మంది మద్దతుదారు కోలాహలం మధ్య ఆయన మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న తనకు మద్దతిస్తున్న వారికి, తనను చూడ్డానికి ఎంబసీ వద్దకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

అణచివేతను ఐక్యంగా ఎదుర్కోవాలి

వివిధ దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛపై అణచివేత గురించి అసాంజే ప్రస్తావించారు. ‘అణచివేతలో ఐక్యత ఉంది. కనుక దాన్ని ఎదుర్కోవడంలోనూ పూర్తి ఐక్యత, సంకల్పం ఉండాలి. అమెరికా వికీలీక్స్‌ను వెంటాడి వేధించడం మానుకోవాలి. విజిల్ బ్లోయర్స్‌పై అమెరికా యుద్ధం ఆగి తీరాలి. ఎఫ్‌బీఐ దర్యాప్తును రద్దు చేయాలి. అది వికీలీక్స్ అయినా, న్యూయార్క్ టైమ్స్ అయినా మీడియా సంస్థను వేధించడమదానిపై మూర్ఖపు చర్చ ఇక సాగకూదు. వికీలీక్స్ సిబ్బందిని, మద్దతుదారులను వేధించకూడదు’ అని అన్నారు. వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాడ్లీ మానింగ్‌ను విడుదల చేయాలని అమెరికాను డిమాండ్ చేశారు. ‘బ్రాడ్లీ నిజంగా లీక్ చేసి ఉంటే అతడు హీరో. ప్రపంచంలోనే గొప్ప రాజకీయ ఖైదీ. మాకు ఆదర్శం’ అని వ్యాఖ్యానించారు. 

ఈక్వెడార్ కు కృతజ్ఞతలు

తనకు ఎంతో ధైర్యంగా రాజకీయ ఆశ్ర యమిచ్చిన ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరెయాకు, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అసాంజే చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న అమెరికా, బ్రిటన్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కృతజ్ఞతని పేర్కొన్నారు. ప్రపంచం చూస్తోందే కనుకే తనను అరెస్టు చేయాలనుకుంటున్న బ్రిటన్ ఇంతవరకు ఎంబసీల భద్రతపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదన్నారు. 

‘ఈక్వెడార్ ఎంబసీ జోలికొస్తే ఖబడ్దార్’

అసాంజేకు ఆశ్రయమిచ్చిన ఈక్వెడార్‌కు లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలు వెన్నుదన్నుగా నిలిచాయి. లండన్‌లోని ఆ దేశ ఎంబసీకి ఉన్న దౌత్య రక్షణను ఉల్లంఘిస్తే బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈక్వెడార్ విజ్ఞప్తిపై బొలీవియన్ అలయన్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అమెరికా(ఆల్బా) పైవిధంగా స్పందించింది. బ్రిటన్ బలప్రయోగ యత్నాలను ఖండించాలని ఆ కూటమి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వెనెజులా నేతృత్వంలోని ఆల్బా కూటమిలో బొలీవియా, క్యూబా, నికరాగువాలతోపాటు పలు కరీబియన్ దేశాలున్నాయి.
Read more >>

Tuesday

మలేసియా యజమాని అకృత్యం తెలుగు మహిళపై ఏడాదికి పైగా అత్యాచారం ...

మలేసియా యజమాని అకృత్యం తెలుగు మహిళపై ఏడాదికి పైగా అత్యాచారం ...

తన మలేసియన్ యజమాని దాదాపు ఏడాదికి పైగా తనపై అత్యాచారం చేశాడంటూ ఓ తెలుగు మహిళ(26) ఆరోపించింది. తనపేరు 'ఎస్' అని మాత్రమే చెప్పిన ఆమె.. మలేసియాలో ఓ సన్‌డ్రై స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేసేందుకు 2010లో వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఆమెకు 2011 నుంచి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే యజమాని దాదాపు ప్రతిరోజూ తనపై అత్యాచారం చేసేవాడని, ఎప్పుడైనా ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టేవాడని ఆమె వా పోయింది.

అతడి కారణంగా తాను రెండుసార్లు అబార్షన్లు చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పింది. గత నెలలో తప్పించుకున్న తాను ఓ చర్చి, మరో మానవహక్కుల సంఘం నుంచి సాయం పొందానంది. ఈ విషయమై తాను భారత హైకమిషన్‌కు, కార్మికశాఖకు, పోలీసులకు ఫిర్యాదులు చేసినా, వాళ్లు తన యజమానిని హెచ్చరించి వదిలేశారే తప్ప చర్యలు తీసుకోలేదని వాపోయింది.
Read more >>

భారత్ జోక్యం తగదు అబూసలేం వ్యవహారంలో పోర్చుగల్ రాజ్యాంగ న్యాయస్థానం...

భారత్ జోక్యం తగదు అబూసలేం వ్యవహారంలో పోర్చుగల్ రాజ్యాంగ న్యాయస్థానం...

అబూసలేం అప్పగింత వ్యవహారంలో భారత్‌కు చుక్కెదురైంది. అప్పగింత ఒప్పందం రద్దు విషయంలో జోక్యం చేసుకునే అర్హత ఆ దేశానికి లేదని పోర్చుగల్ అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం తేల్చి చెప్పింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన సలేం పోర్చుగల్ పోలీసులకు 2002లో చిక్కాడు. ఈ కేసు విచారణ నిమిత్తం సలేంను, ఆయన స్నేహితురాలు మోనికాబేడీని 2005లో భారత్‌కు అప్పగించింది.

ఉరిశిక్ష పడే విధంగా సలేంపై సీబీఐ అభియోగాలను మోపడంతో.. ఆ అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేస్తూ పోర్చుగల్‌లో దిగువ కోర్టు తీర్పు చెప్పింది. దానినే ఖరారు చేస్తూ అక్కడి సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్వులు వెలువరించింది. దీనిని భారత్ సవాల్ చేయడాన్ని పోర్చుగల్ రాజ్యాంగ న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ తనంతట తానుగా జోక్యం చేసుకొనే అర్హత లేదని స్పష్టం చేసింది.
Read more >>

Monday

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000
యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి అనేక జబ్బులు చుట్టుముట్టి మరణాల సంఖ్య బాగా పెరుగుతోందని తెలిపింది. దేశంలో పిల్లల పేరు చెప్పుకుని ఎన్.జి.ఒ సంస్ధలు అనేకం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారికి అందుతున్న నిధులు బాధితుల వరకూ చేరడంలేదని ‘ఆల్ జజీరా’ వార్తా సంస్ధ తెలిపింది.
యెమెన్ లో మెజారిటీ ప్రజలు పేదలే. ఆయిల్ సంపద అంతా ప్రవేటు కంపెనీలు, నియంతృత్వ పాలకులు పంచుకు తింటుండగా దేశ వనరులకు అసలు యజమానులయిన ప్రజలు మాత్రం దరిద్రంలో మగ్గుతున్నారు. అవిద్య వల్ల మతపరమైన మూఢనమ్మకాలు పెచ్చరిల్లి పసి పిల్లలకు అదనపు కష్టాలను తెస్తున్నాయి. వైద్య సౌకర్యాలు మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉండవు. యునిసెఫ్ లాంటి సంస్ధలు రాజధాని నగరంలో తూతూ మంత్రంగా శిబిరాలు నెలకొల్పినా అవేమీ పల్లె జనానికి అక్కరకు రావడం లేదు. ఈ దుర్భర పరిస్ధితుల నుండి పుట్టిన తిరుగుబాటును నియంతృత్వ పాలకులు క్రూరంగా అణచివేస్తుండగా వారికి పశ్చిమ దేశాలు అండగా నిలుస్తున్నాయి. సిరియాలో లేని తిరుగుబాటుకి ఆయుధాలు సరఫరా చేస్తూ, మిలియన్ల కొద్దీ తగలేస్తున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు యెమెన్ లో ప్రజలను దారుణంగా అణచివేస్తున్నప్పటికీ పట్టించుకోవు. వారి కంపెనీల వ్యాపారాలకు సహకరించే పాలకులు నియంతలైనా, మానవ హక్కులను హరించివేస్తున్నా, ప్రజా తిరుగుబాట్లను అణచివేస్తున్నా వారికి అనవసరం.
ఆల్ జజీరా, రాయిటర్స్, యునిసెఫ్ అందించిన ఫొటోలివి :-













Read more >>

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని ఒక ప్రకటనలో తెలిపింది.
ఆఫ్ఘనిస్ధాన్ లో భారత్ ప్రయోజనాలపై పదే పదే దాడులు చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటూ, పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ కు దగ్గరి సంబంధాలున్నాయని భావిస్తున్న తాలిబాన్ నుండి భారత్ కు ఇలాంటి ప్రశంసలు రావడం అనూహ్య పరిణామం. ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ అధికారంలోకి రాకముందు తాలిబాన్ చేత పదవీచ్యుతం కాబడిన నార్త్రన్ అలయన్స్ కు భారత్ మద్దతు ఇచ్చింది. 1996 లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకున్న అనంతరం భారత్ ను దాదాపు ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్లగొట్టారు. వెళ్లగొట్టడం అంటే భారత కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా నిరాకరించడమే.
తాలిబాన్ తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న హక్కానీ నెట్ వర్క్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ లోని భారత ప్రయోజనాలపై అనేకసార్లు దాడులు నిర్వహించింది. ఈ హక్కానీ నెట్ వర్క్ కు ఐ.ఎస్.ఐ మద్దతు ఉందని పత్రికలు తరచూ రాస్తుంటాయి. ఆఫ్-పాక్ సరిహద్దులో పాకిస్ధాన్ లోని గిరిజన ప్రాంతాల నుండి హక్కానీ గ్రూపు ప్రధానంగా పని చేస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ఈ గ్రూపు ఆఫ్ఘనిస్ధాన్ తో పాటు పాకిస్ధాన్ లో కూడా అనేక దాడులు నిర్వహించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ డిప్లొమేటిక్ డిస్ట్రిక్ట్ లో సైతం ఈ గ్రూపు అనేక హై ప్రొఫైల్ దాడులు నిర్వహించింది. అమెరికా మిలట్రీ అధికారులు అనేక సార్లు హక్కానీ గ్రూపు ని అత్యంత ప్రమాదకరమైన సంస్ధగా అభివర్ణించడం కద్దు. ఆఫ్ఘన్ లోని భారత రాయబార కార్యాలయంపై కూడా ఈ గ్రూపు దాడి చేసింది.
ఈ నేపధ్యంలో భారత్ కు తాలిబాన్ నుండి ప్రశంసలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుండి అమెరికా సైనికులు మెజారిటీ ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకుంటామని ఒబామా ఇప్పటికే ప్రకటించినందున దక్షిణాసియా భవిష్యత్ ముఖ చిత్రంలో భారత్ ఇప్పటికంటే చురుకయిన పాత్ర నిర్వహించాలని అమెరికా కోరుకుంటున్నట్లు వివిధ వార్తలు తెలియజేస్తున్నాయి. సివిలియన్ కాంట్రాక్టుల వరకే ఇప్పటివరకూ భారత్ పాత్ర పరిమితమై ఉంది. ఆఫ్ఘన్ మిలట్రీ అధికారులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ అది పరిమితమే. అది కూడా భారత భూభాగంలోనే బోధనా రూపంలోనే పరిమితమయింది. సివిలియన్ కాంట్రాక్టుల రూపంలో ఆఫ్ఘనిస్ధాన్ లో భారత్ ఇప్పటివరకూ 2 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు పెట్టిందని ‘ది హిందూ’ తెలిపింది. హై వేల నిర్మాణంలోనూ, ఆఫ్ఘన్ పార్లమెంటు నిర్మాణంలోనూ భారత్ కాంట్రాక్టర్ల పాత్ర ఉందని, అయితే ఆఫ్ఘన్ భద్రతా బలగాల విషయాలనుండి భారత్ దూరంగా ఉంటూవచ్చిందని ఆ పత్రిక తెలిపింది.
భారత్ కార్యకలాపాలు ఇంకా విస్తరించాలని అమెరికా కోరుకుంటోంది. అమెరికా సైనికుల్లో కొంత భాగాన్ని ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకుని సిరియా, ఇరాన్ ల చుట్టూ కేంద్రీకరించడానికి అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆఫ్ఘనిస్ధన్ లో అమెరికా తరపున భారత్ తగిన పాత్ర నిర్వహించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ విషయాన్ని చర్చించడానికే ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లియోన్ పెనెట్టా భారత్ కి వచ్చినట్లు తాలిబాన్ ప్రకటన ద్వారా అర్ధం అవుతోంది. సార్వభౌమత్వం, సమానత్వం, పరస్పర గౌరవం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం… మొదలయిన విలువల ప్రాతిపదికన భారత్ తో సత్సంబంధాలను మాత్రమే తాము కోరుకుంటామని తాలిబాన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
“ఈ ప్రాంతంలో ఇండియా ముఖ్యమైన దేశం అనడంలో సందేహం లేదు… ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలు, మత విశ్వాసాలు, స్వాతంత్ర్యంపై ఉన్న ప్రేమ వారికి బాగా తెలుసు. కేవలం అమెరికా ఒత్తిడితో ఆఫ్ఘన్ ఆపదలోకి వారి దేశాన్ని నెట్టడం పూర్తిగా తర్క విరుద్ధం” అని తాలిబాన్ ప్రకటన పేర్కొంది. 2014 లో అత్యధిక సంఖ్యలో విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ విడిచి వెళ్లనున్నందున ఇక్కడ మరింత చురుకైన పాత్ర నిర్వహించాలని ఇటీవలి సందర్శన సందర్భంగా లియోన్ పెనెట్టా భారత్ ను కోరాడనీ అయితే తన ప్రయత్నాలలో పెనెట్టా విజయంగానీ, ప్రగతి గాని సాధించలేకపోయాడనీ ఆ ప్రకటన తెలిపింది. పెనెట్టాను ఇండియా ఒట్టి చేతులతో కాబూల్ కి పంపిందనీ ప్రకటన తెలిపింది.
“పెనెట్టా ఇండియాలో మూడు రోజులు గడిపి భారీ బరువును ఇండియా భుజాలపైకి మార్చడానికి ప్రయత్నాలు చేశాడు. తద్వారా ఆఫ్ఘన్ నుండి పారిపోవడానికి దారి వెతుక్కోవాలని పెనెట్టా ప్రయత్నించాడు” అని అమెరికా దురాక్రమణ సైన్యాలతో పది సంవత్సరాలకు పైగా పోరాడుతున్న తాలిబాన్, తన ప్రకటనలో పేర్కొంది. “ఈ డిమాండ్లకు ఇండియా తలొగ్గలేదని విశ్వసనీయమైన మీడియా సోర్సెస్ ద్వారా తెలిసింది. అమెరికా డిమాండ్ల పట్ల రిజర్వేషన్స్ ప్రకటించారనీ తెలుస్తోంది. ఎందుకంటే  అమెరికన్లు తమపై వేటు వేసే గొడ్డలిని వారే నూరుకుంటున్నారని ఇండియాకు తెలుసు, లేదా తెలుసుకోవాలి” అని ప్రకటన లో పేర్కొన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది.
వివిధ దేశాల మధ్య సమానత్వం ప్రాతిపదికన సంబంధాలు ఉండాలనీ, స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలనీ తాలిబాన్ చేసిన డిమాండు సమర్ధనీయం. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాక స్వతంత్ర దేశాలను వివిధ సాకులతో దురాక్రమించుకోవడం తమ హక్కుగా అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఈ దుర్మార్గాలను భారత దేశం అంతర్జాతీయ వేదికలపై తగిన విధంగా ఖండించి తిరస్కరించ వలసిన బాధ్యత ఉంది. నెహ్రూ, ఇందిరా ల హయాంలో అలీన దేశాల కూటమి కి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన ఇండియా గత రెండు మూడు దశాబ్దాలుగా ఆ పాత్రను త్యజించడం సమర్ధనీయం కాదు.

Read more >>

టర్కీ విమానం కూల్చివేత పై నాటో సమావేశం

టర్కీ విమానం కూల్చివేత పై నాటో సమావేశం

సిరియా గగనతలంలోకి చొరబడిన టర్కీ విమానాన్ని సిరియా కూల్చివేయడం పై నాటో దేశాలు సమావేశం కానున్నాయి. టర్కీ, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశం. నాటో సంస్ధ ఆర్టికల్ 4 ప్రకారం సంస్ధ సభ్య దేశం తమ ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వతంత్రత ప్రమాదంలో పడిందని భావించినపుడు నాటో దేశాల సమావేశం కోసం విజ్ఞప్తి చేయవచ్చు. దాని ప్రకారమే నాటో సమావేశం ఏర్పాటు చేయాలని టర్కీ కోరిందని నాటో ప్రతినిధి ఒనా లుంగెస్క్యూ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. నాటో లో నిర్ణయాలు తీసుకునే నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ మంగళవారం సమావేశం జరుపుతుంది.
టర్కీ కి చెందిన ‘ఎఫ్-4 ఫాంటమ్’ యుద్ధ విమానం సిరియా గగనతలంలోకి చొరబడడంతో దానిని సిరియా మిలట్రీ శుక్రవారం కూల్చివేసింది. సిరియా గగనతలంలోకి తమ విమానం చొరబడలేదని టర్కీ చెబుతున్నప్పటికీ విమానం సిరియా సముద్ర జలాల్లోనే కూలిపోయిందని టర్కీ టి.వి చానెళ్లు చెబుతున్నట్లు పత్రికలు తెలిపాయి. సరిహద్దు జలాల్లో ఎగురుతున్నపుడు విమానాలు పొరుగు దేశం గగనతలంలోకి వెళ్ళడం రోటీనేనని టర్కీ విదేశాంగ మంత్రి అహ్మత్ దవుతోగ్లు అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా గుల్ కూడా తమ విమానం సిరియా గగనతలన్నీ ఉల్లంఘించ ఉండవచ్చని వ్యాఖ్యానించాడు. విమానాన్ని కూల్చినపుడు మాత్రం అది అంతర్జాతీయ గగనతలంలోనే ఉన్నదని దవుతోగ్లు చెప్పాడు.
సిరియా లోకి టర్కీ విమానం జొరబడ్డ విషయం వదిలి విమానాన్ని సిరియా కూల్చడాన్నే చర్చగా చేయడానికి టర్కీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ప్రాపకంతో సిరియాలో అంతర్యుద్ధానికి టర్కీ సహకరిస్తోంది. సిరియా టెర్రరిస్టులకు శిక్షణ కూడా ఇస్తున్నది. టర్కీ ద్వారా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, ధన సహాయంతో పాటు కిరాయి తిరుగుబాటుదారుల సరఫరా కూడా జరుగుతున్నది.
ఈ విషయాన్ని జూన్ 22 నాటి కధనంలో ‘ది గార్డియన్’ పత్రిక మరోసారి తెలియజేసింది కూడా. ఇస్తాంబుల్ లో 22 మంది సభ్యుల కమాండ్ సెంటర్ ను సిరియా తిరుగుబాటుదారులు నెలకొల్పడానికి టర్కీ అనుమతి ఇచ్చిందని గార్డియన్ తెలిపింది. ఈ సెంటర్ ద్వారా సిరియాలోని సాయుధ కిరాయి బలగాలకు సరఫరాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ నేపధ్యంలో సిరియాలో అల్లకల్లోలం సృష్టించి ఆ దేశాన్ని ముక్కలు చేయడానికి నాటో చేస్తున్న ప్రయత్నాలకు విమాన కూల్చివేత అదనపు అవకాశంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాటో ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
విమానం కూల్చివేతను సిరియా విదేశాంగ మంత్రి జిహాద్ మక్దిస్సీ యాక్సిడెంట్ గా అభివర్ణించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. కొంతమంది చెబుతున్నట్లు అది దాడి కాదని ఆయన అన్నాడని తెలిపింది. సిరియా సముద్ర జలాల్లోకి విమానం చొచ్చుకుని వచ్చినందునే కూల్చామని ఆయన అన్నాడని తెలిపింది.
ఇదిలా ఉండగా సిరియాలోకి ఆయుధాలను స్మగుల్ చేయడానికి ప్రయత్నిస్తున్న 40 మంది జర్మన్లను సిరియా అరెస్టు చేసింది. 40 మంది జర్మనీ దేశధులు ఒక సెక్యూరిటీ సంస్ధ లో ఉద్యోగులను ఎన్.ఎస్.ఎన్.బీ.సీ న్యూస్ బ్లాగ్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. జర్మన్లతో పాటు 300 మంది విదేశీయులను ఇప్పటివరకూ సిరియా ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపింది. ఈ విషయంపై జర్మనీ నుండి ఎలాంటి వ్యాఖ్యా వెలువడలేదు. ఇందకుముందు కూడా 100 మందికి పైగా ఫ్రెంచి దేశస్ధులను సిరియా పట్టుకుని అరెస్టు చేసింది. అనేకమంది విదేశీ కిరాయి సైనికులను సిరియా అరెస్టు చేసినప్పటికీ తిరుగుబాటులో తమ పాత్ర లేదని పశ్చిమ దేశాలు బొంకడం మానలేదు.

Read more >>

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.
టర్కీ విమానం కూల్చివేతను అడ్డు పెట్టుకుని సిరియాపై దురాక్రమణ దాడి చెయ్యడానికి నాటో దేశాలు వ్యూహాలు పన్నుతున్న నేపధ్యంలో సిరియా కేంద్రంగా జరుగుతున్న రోజువారీ పరిణామాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. జూన్ 22 న సిరియా గగనతలంలో చొరబడిన టర్కీ గూఢచార యుద్ధ విమానాన్ని సిరియా కూల్చివేసింది. టర్కీ విమానం సిరియాలోకి చొరబడి ఉండవచ్చని టర్కీ విదేశాంగ మంత్రి సైతం అంగీకరించాడు. టర్కీ లోని టి.వి చానెళ్ళు, వార్తా పత్రికలు కూడా టర్కీ విమాన శిధిలాలు సిరియా సముద్ర జలాల్లోనే కూలాయని చెప్పినట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడి చేశాయి. అయినప్పటికీ నాటో సమావేశాలు జరిగాక బొంకడాన్ని టర్కీ తీవ్రం చేసినట్లు పత్రికల వార్తల ద్వారా అర్ధమవుతోంది.
రష్యా కి చెందిన ‘మిలటరీ-డిప్లొమేటిక్ సోర్స్’ తమకు సమాచారం ఇచ్చినట్లు ఇంటర్ ఫాక్స్ తెలిపింది. “(టర్కీ) జెట్ సిరియా గగనతలాన్ని ఉల్లంఘించిందని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది” అని సదరు సోర్స్ చెప్పినట్లు ఇంటర్ ఫాక్స్ తెలిపింది. “సిరియాలో రష్యా ప్రయోజనాలున్నాయ”నీ, వివిధ చానెళ్ల ద్వారా తాము పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నామనీ రష్యా సోర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. రష్యా వాయు, అంతరిక్ష బలగాలతో పాటు నౌకా బలగాలకు కూడా అలాంటి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించగల సామర్ధ్యం ఉందని కూడా రష్యా మిలట్రీ చెప్పినట్లు తెలుస్తోంది.
తమ విమాన శిధిలాలు సిరియా జలాల్లోనే కూలాయని టర్కీ అంగీకరించింది. అయినప్పటికీ విమానం మాత్రం అంతర్జాతీయ ‘ఎయిర్ స్పేస్’ లోనే ఉన్నట్లు టర్కీ బొంకుతోంది. అమెరికా గూఢచార అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం కూడా టర్కీ చెబుతున్నదానికి విరుద్ధంగా ఉంది. అమెరికా అధికారి ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికకు చెప్పినదాని ప్రకారం సిరియన్లు టర్కీ యుద్ధ విమానాన్ని ఒడ్డుపై ఆధారపడి ఉన్న విమాన వ్యతిరేక ఫిరంగులతోనే (Anti-aircraft artillery) కూల్చారు తప్ప ‘ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే’ (surface-to-air) మిస్సైళ్లతో కాదు. దానర్ధం టర్కీ విమానం సిరియా గగనతలంలో ఎగురుతున్నట్లేనని ‘ది హిందూ’ తెలిపింది.
తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. ఆ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ శనివారం ఒక ప్రకటన జారీ చేశాడు. సిరియా పరిస్ధితిపై శనివారం జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగిన అనంతరం లావరోవ్ ఈ ప్రకటన చేశాడు. సిరియాలో ‘ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్’ ఏర్పాటు చేయవలసి ఉన్నదంటూ కోఫీ అన్నన్ చేసిన ప్రతిపాదనను జెనీవా సమావేశం ఆమోదించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ కు కొత్త ప్రభుత్వంలో స్ధానం లేకుండా చేయడానికి పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలను రష్యా, చైనాలు తిప్పి కొట్టాయి. సిరియా ప్రభుత్వంలో ఎవరు ఉండాలన్నదీ తేల్చవలసింది సిరియా ప్రజలే తప్ప పశ్చిమ దేశాలు కాదని అవి తేల్చి చెప్పాయి.
ఇరాక్ పై దురాక్రమణ దాడి జరపడానికి ముందు కూడా నాటో దేశాలు టర్కీ ని అడ్డుపెట్టుకున్నాయి. టర్కీ దేశానికి ఇరాక్ తక్షణ ప్రమాదంగా మారిందని ఆ దేశం ప్రకటించాక దాన్ని అడ్డు పెట్టుకుని ఇరాక్ దురాక్రమణకి నాటో తెగించింది. సిరియా పై దురాక్రమణ యుద్ధానికి కూడా మరోసారి పశ్చిమ దేశాల చేతుల్లో పావుగా ఉపయోగపడడానికి టర్కీ సిద్ధమవుతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచంలో బలహీన దేశాలపై మిలట్రీ పెత్తనం సాగించే నాటో దుష్ట కూటమిలో టర్కీ సభ్య దేశం. సిరియా సైన్యం కంటే, టర్కీ సైన్యం అనేక రేట్లు పెద్దది. భూభాగం విస్తృతిలో చూసుకున్నా టర్కీకి ప్రమాదంగా మారగల అవకాశాలు సిరియాకి ఏ కోశానా లేవు. తమ దేశ రక్షణే సమస్యగా మారిన సిరియాకు టర్కీకి ప్రమాదకరంగా మారడం సాధ్యం కాదు. తాను తాగుతున్న నీరు నీవల్ల కలుషితం అవుతున్నదంటూ మెరకలో ఉన్న తోడేలు, పల్లంలో ఉన్న గొర్రెను బెదిరిస్తున్నట్లే టర్కీ బెదిరింపులు సాగుతున్నాయి.
కానీ సిరియా, ఇరాక్ లా కాదు. సిరియాలో ప్రయోజనాలు కాపాడుకోవడానికి రష్యా సిద్ధపడుతోంది. చైనాకి కూడా సిరియాలో వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఇరాన్ ప్రాంతీయ ప్రయోజనాలకు సిరియా ఫ్రంట్ లాంటిది. కనుక ఇరాన్ జోక్యం అనివార్యం. ఇజ్రాయెల్ నక్క జిత్తులు ఎలాగూ తప్పవు. ఇరాన్ పై దాడికి ఉరకలు వేస్తున్న ఇజ్రాయెల్ చేతులు ముడుచుకు కూర్చోదు. ఇజ్రాయెల్ ప్రవేశంతో అరబ్ దేశాలు కూడా ఏదో మేరకు ఘర్షణలో పాత్ర పోషించిక తప్పదు. అరబ్-ఇజ్రాయెల్ పరోక్ష ఘర్షణ సైతం మధ్య ప్రాచ్యంలో అరబ్ ప్రజల సెంటిమెంట్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. ఇప్పటికే పీకల లోతు ఆర్ధిక సంక్షోభంలో ఉన్న పశ్చిమ దేశాలు సిరియాపై దాడి చేస్తే మరింత సంక్షోభంలోకి జారడం ఖాయం. సంక్షోభం నుండి తప్పించుకోవడానికి పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ప్రజల ఆదాయ వనరులపై మరింత దాడిని ఎక్కుపెడతాయి. యుద్ధంలో చితికిపోయేది ఏ దేశంలోనైనా అంతిమంగా ప్రజలే.

Read more >>

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ఇరాన్ ఆయిల్ వనరులను పశ్చిమ దేశాల కంపెనీలకు అప్పగించేలా ఇరాన్ పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ అణ్వాయుద్ధం పేరుతో దశాబ్దాలుగా నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జనవరి 1 న అమెరికా ప్రకటించిన ఆయిల్ ఆంక్షలకు తోడు యూరోపియన్ యూనియన్ కూడా స్వంత ఆంక్షలు ప్రకటించింది. ఇవన్నీ జులై 3 నుండి అమలులోకి వచ్చాయి. ఆంక్షలు అమలులోకి వచ్చిన ఒక్క రోజులోనే ఇరాన్ పార్లమెంటు దేశ ప్రయోజనాల రక్షణకు రంగంలోకి దిగింది. ఇరాన్ పార్లమెంటు కి చెందిన ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్’  హోర్ముజ్ ద్వీపకల్పం గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి అప్పగించే బిల్లును రూపొందించింది.
“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పై యూరోపియన్ యూనియన్ (ఇ.యు) విధించిన ఆయిల్ ఆంక్షలకు సమాధానంగానే ఈ బిల్లు రూపొందించాం” అని ఇరానియన్ పార్లమెంటు సభ్యులు అఘా-మొహమ్మది చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ప్రపంచ క్రూడాయిల్ రవాణాలో 20 శాతం హోర్ముజ్ గుండా జరుగుతున్నందున ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకున్నట్లయితే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందని పత్రిక విశ్లేషించింది.
ఆయిల్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాల్లో అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా తర్వాత ఇరానే. ఇ.యు ఆంక్షలు పూర్తిగా అమలులోకి వచ్చినట్లయితే ప్రపంచ దేశాలకు రోజుకు 10 లక్షల బ్యారేళ్ళ క్రూడాయిల్ సరఫరా ఆగిపోతుందని ప్యారిస్ లోని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ చెబుతూ వచ్చింది. ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ఆయిల్ ధరలు అమాంతం పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. ఆయిల్ మార్కెట్ ను రాజకీయం చేసిన ఫలితంగా ఇప్పటికే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఇ.యు యే గరిశంగా దుష్ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఒపెక్ లో ఇరాన్ ప్రతినిధి మహమ్మద్ ఆలీ ఖటీబీ హెచ్చరించాడు.
ఆంక్షలు ప్రకటించినప్పటి నుండీ యూరోపేతర దేశాలకు ఇరానియన్ ఆయిల్ రవాణా చేసే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ కల్పించడానికి పశ్చిమ దేశాల ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. దీనివల్ల కూడా క్రూడాయిల్ ధరలపై ప్రభావం పడుతోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు భీమా సౌకర్యం ఎత్తివేయడం వల్ల అధికంగా ప్రభావితమయ్యే దేశాలలో ఇండియా కూడా ఉంది. ఇండియాతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు జరిగే ఆయిల్ రవాణా పై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది.
ఇరాన్ ఆర్ధిక బాగుకు ఆసియా మార్కెట్లు కీలకంగా ఉన్నాయి. దానివల్ల ఇరాన్ కూడా ప్రత్యామ్న్యాయ సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వస్తోంది. పశ్చిమ దేశాల కంపెనీల ఇన్సూరెన్స్ తో పని లేకుండా తమ సొంత ట్యాంకర్లతో ఆయిల్ రవాణా చేస్తామని ఆ దేశం దక్షిణ కొరియాకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కొరియా ఆమోదం చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ పై పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా ఇప్పటికే ప్రపంచ ప్రజానీకానికి, ముఖ్యంగా ఆసియా ప్రజానీకానికి పెట్రోల్ ఖరీదైపోయింది. ఇరాన్ ప్రతిఘటన చర్యలతో రానున్న రోజుల్లో హోర్ముజ్ ద్వీపకల్పం కేంద్రంగా క్రూడాయిల్ రాజకీయాలు వేడెక్కి, ఆయిల్ ధరలు ఇంకా పై పైకి పాకనున్నాయి.

Read more >>

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ, ప్రభుత్వమూ, రెగ్యులేటరీ వ్యవస్ధ, టెప్కో కంపెనీలు మొత్తంగా ఈ వినాశనానికి కారకులని కమిటీ స్పష్టం చేసిందని ఆస్ట్రేలియాకి చెందిన ఎస్.బి.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. బి.బి.సి ప్రకారం అధికారాన్ని ప్రశ్నించడంలో ఉదాసీనతనూ, సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా నివేదిక తప్పు పట్టింది.
“ప్రభుత్వం, (ప్రవేటు అణు కంపెనీలను నియంత్రించవలసిన న్యూక్లియర్) రెగ్యులేటర్లు, ప్లాంటు నిర్వాహకురాలైన టెప్కో కంపెనీ కుమ్మక్కు అయిన ఫలితమే టెప్కో ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో జరిగిన ప్రమాదం. ఈ మూడు పార్టీలలో పాలన (governance) లోపించడం వల్ల ప్రమాదం జరిగింది” అని కమిటీ అంతిమ నివేదిక పేర్కొంది. కమిటీ మాటల్లోనే చెప్పాలంటే…
“The TEPCO Fukushima Nuclear Power Plant accident was the result of collusion between the government, the regulators and (plant operator) TEPCO, and the lack of governance by said parties. … … … They effectively betrayed the nation’s right to be safe from nuclear accidents. Therefore, we conclude that the accident was clearly ‘man-made.”
“అణు ప్రమాదాల నుండి భద్రంగా ఉండడానికి దేశానికి గల హక్కుకు వారు సమర్ధవంతంగా ఢోకా యిచ్చారు. కనుక (ఫుకుషిమా) ప్రమాదం మానవ తప్పిదమేనని స్పష్టంగా నిర్ధారిస్తున్నాం” అని కమిటీ నివేదిక పేర్కొంది. 900 గటల పాటు పని చేసిన కమిటీ వయ్యిమందికి పైగా సాక్ష్యాలు సేకరించిందని బి.బి.సి తెలిపింది.
అనేక స్వచ్ఛంద సంస్ధలు, కార్యకర్తలు, స్వతంత్ర పరిశీలకులు, శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన అంశాలను జపాన్ పార్లమెంటు కమిటీ నివేదిక నిర్ద్వంద్వంగా బలపరిచింది. జపాన్ ప్రభుత్వం ప్రమాదానికి కారకురాలయిన కంపెనీని బాధ్యురాలిని చేయడానికి బదులు దానిని కాపాడడానికే పూనుకుందని వివిధ వార్తా సంస్ధలు ప్రచురించిన కధనాలు వాస్తవాలేనని కమిటీ నివేదిక ద్వారా రుజువయింది. లాభాపేక్షతో ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలే అణు కంపెనీలను నియంత్రించడానికి కృషి చేయవలసిన ప్రభుత్వ ‘రెగ్యులేటరీ వ్యవస్ధలు’ ఆచరణలో కంపెనీలతో కుమ్మక్కయ్యాయని నివేదిక ద్వారా స్పష్టమయింది.
20 మీటర్ల ఎత్తు అలలతో విరుచుకు పడిన సునామీ వల్లనే ఫుకుషిమా అణు కర్మాగారం లో ప్రమాదం సంభవించిందే తప్ప ఇందులో తమ తప్పేమీ లేదని ఫుకుషిమా అణు కర్మాగారం నిర్వాహక కంపెనీ టెప్కో పదే పదే చెబుతూ వచ్చింది. సునామీ అలలవల్ల జనరేటర్లు పని చేయకపోవడంతో ‘బేకప్’ విద్యుత్ అందలేదనీ, దానితో కూలింగ్ వ్యవస్ధ పని చేయడం ఆగిపోయాయని కంపెనీ వాదించింది. శీతలీకరణ ప్రాక్టియ ఆగిపోవడంతో రియాక్టర్లలో ఇంధన రాడ్లు వేడెక్కి కరిగిపోయాయనీ ఆ తర్వాతే ‘మెల్ట్ డౌన్’ (ఇంధన రాడ్లు కరిగిపోవడం) మొదలయిందనీ టెప్కో మొదటినుండీ వాదించింది. జపాన్ ప్రభుత్వం కంపెనీ వాదనలో నిజా నిజాలను విచారించడానికి బదులు పూర్తి మద్దతు అందజేసింది.
అయితే ఆ తర్వాత వెల్లడయిన వాస్తవాలు కంపెనీ, ప్రభుత్వాల వాదనకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అణు కర్మాగారంలో నిర్మాణాలు సరైన నిర్వహణ లేక బలహీనపడడంతో భూకంపం ధాటికి దెబ్బతిన్నాయనీ, మరో అరగంటకు సునామీ అలలు విరుచుకుపడే లోపే రియాక్టర్లకు జరగవలసిన నష్టం జరిగిపోయిందనీ బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ గత సంవత్సరం ఆగస్టు లో పరిశోధనాత్మక కధనం ప్రచురించింది. (దాని ఆధారంగా ఈ బ్లాగ్ లో రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.)
‘ది ఇండిపెండెంట్’ తో పాటు అనేక మంది స్వచ్ఛంద మరియు స్వతంత్ర కార్యకర్తలు, ప్రొఫెసర్లు, రేడియాలజిస్టులు, పర్యావరణవేత్తలు వివిధ పద్ధతుల్లో ఇలాంటి వాస్తవాలను వెల్లడి చేశారు. అయితే జపాన్ ప్రభుత్వం గానీ, టెప్కో కంపెనీ గానీ తమ అబద్ధాలను సవరించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కావచ్చు, పోవచ్చు అంటూ సన్నాయి నొక్కులు నోక్కేరే తప్ప ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఎన్నడూ సిద్ధపడలేదు. జపాన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో వారి మోసాలు మరోసారి ధ్రువపడ్డాయి.
కేవలం వ్యక్తులను నిందించడానికి పార్లమెంటరీ కమిటీ ఇష్టపడలేదు. ప్రభ్యుత్వ పాలనా వ్యవస్ధలు, కంపెనీల నియంత్రణా వ్యవస్ధలు అనుకున్న విధంగా తగిన పద్ధతుల్లో పని చేయకపోవడాన్ని అది తప్పు పట్టింది. తన నివేదికలో కమిటీ ఇంకా ఇలా పేర్కొంది. “ఎవరైనా ఒక నిర్ధిష్ట వ్యక్తి సమర్ధతకు సంబంధించిన అంశాల కంటే, వివిధ నిర్ణయాలకూ, చర్యలకూ తప్పుడు హేతువులతో మద్దతు ఇచ్చిన సంస్ధాగత మరియు నియంత్రణా వ్యవస్ధలే మూల కారణాలని మేము నమ్ముతున్నాం.” (“We believe that the root causes were the organisational and regulatory systems that supported faulty rationales for decisions and actions, rather than issues relating to the competency of any specific individual.”)
సునామీ వల్ల జరిగిన నష్టం పైనే కేంద్రీకరించడానికి బదులు దానికంటే ముందు వచ్చిన భూకంపం వల్ల జరిగిన నష్టంపై మరింత పరిశోధన జరగాలని కమిటీ నివేదిక కోరింది. తప్పు మొత్తం ‘ఎవరూ ఊహించని సునామీ’ పైకి నెట్టడానికే కంపెనీ ప్రధానంగా ఆసక్తి చూపింది. జపాన్ భూభాగంలో భూకంపాలు సర్వ సాధారణం కనుక భూకంపం పై తప్పు నెట్టే అవకాశం కంపెనీకి లేదు. భూకంప ప్రాంతాల్లో వాటికి తట్టుకునే విధంగా కర్మాగారం డిజైన్ ఉండాలి. తమ డిజైన్ ఎంతటి భూకంపాలకైనా తట్టుకుంటుందని న్యూక్లియర్ కంపెనీ ఊదరగొట్టడం వల్ల భూకంపంపై సాకు చూపే అవకాశం టెప్కో కోల్పోయింది. అందువల్ల ఎవరూ ఊహించని ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడ్డాయనీ కనుక ప్రమాదానికి తమ బాధ్యత లేదనీ కంపెనీ వాదించింది. ప్రభుత్వం కూడా ఈ వాదనకు వంతపాడింది. అనేక మంది శాస్త్రవేత్తలు, కార్యకర్తలు ఈ వాదనను సాధికారికంగా ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం, కంపెనీ తలొగ్గలేదు.
పార్లమెంటరీ కమిటీ ఈ వాదనను మరో ఆలోచనకు తావు లేకుండా తిరస్కరించింది. నివేదిక ఇలా పేర్కొంది. “ప్రమాదానికి నేరు కారణం ఏమిటన్న విషయానికి వస్తే, భద్రతకు ముఖ్యమైనవిగా భావించిన పరికరాలు భూకంపం వల్ల పాడైపోలేదని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పలేము. నిర్ధిష్టంగా చెప్పాలంటే, రియాక్టర్ నెం. 1 వద్ద కూలెంట్ (రియాక్టార్లను చల్లబరిచే నీరు) కు నష్టం జరిగిన అవకాశాన్ని కొట్టిపారవేయలేము.” అని పేర్కొంది. దీనర్ధం కంపెనీ వాదనలో నిజం లేదనే. భూకంపం వల్లనే శీతలీకరణ ప్రక్రియ దెబ్బతిన్నదని పార్లమెంటరీ కమిటీ ధృవీకరించిందన్నమాట.
భూకంపాలను తట్టుకోవడానికి తాము అనేక భద్రతా వ్యవస్ధలను అభివృద్ధి చేశామని అణు పరిశ్రమ వర్గాలు అనేక యేళ్ళుగా గొప్పలు చెప్పుకున్నాయి. అవి నిజం కాదని ఫుకుషిమా ప్రమాదం తేల్చి చెప్పింది. తమ గొప్పలు నిజమే అని చెప్పుకోవడానికి పరిశ్రమ నెపాన్ని సునామీ పైకి తోసిందన్నమాట.
కర్మాగారంలో భద్రతను పటిష్టపరిచే చర్యలను తీసుకోకుండా టెప్కో నిర్లక్ష్యం చేసిందని కమిటీ తప్పు పట్టింది. “భూకంప వ్యతిరేక పనులు ఆలస్యం అయ్యాయనీ, సునామీ వ్యతిరేక భద్రతా చర్యలను వాయిదా వేశారనీ టెప్కో యాజమాన్యానికి ముందే తెలుసన్న విషయం మేము పరిగణిస్తున్నాం. ఫుకుషిమా దాయిచి ప్లాంటు (ఫుకుషిమా నెం.1 ప్లాంటు) బలహీనంగా ఉండని కూడా వారికి తెలుసని పరిగణిస్తున్నాం” అని నివేదిక పేర్కొంది. ప్రమాదం ప్రారంభ దశలో నిజాయితీగా స్పందించడంలో టెప్కో విఫలమయిందని కూడా నివేదిక పేర్కొంది. అయితే ఈ వైఫల్యం వ్యక్తులది కాదనీ వ్యవస్ధలదేననీ అభిప్రాయపడింది.
‘న్యూక్లియర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎస్.ఎ) అనే సంస్ధ జపాన్ లో న్యూక్లియర్ కంపెనీలను నియంత్రించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సంస్ధ. ఈ సంస్ధ తన విధులని నిర్వహించడంలో ఘోరంగా విఫలం అయిందని డైట్ కమిటీ నిర్ధారించింది. ప్రమాదం అనంతరం తగిన చర్యలు తీసుకొనేలా టెప్కో ను పురమాయించలేకపోయిందని పేర్కొంది. వివిధ విషయాలలో తప్పులు జరుగుతున్నాయని తెలిసినా నిష్క్రియాపరంగా ఉండిపోయిందని తెలిపింది. “తీసుకోవలసిన చర్యలను టెప్కో వాయిదా వేస్తున్నదని ఎన్.ఐ.ఎస్.ఎ కి తెలుసు. కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గత ప్రమాదాలను మించిపోయిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి అది సిద్ధంగా లేదు” అని నివేదిక పేర్కొంది.
ఫుకుషిమా ప్రమాదం పై అత్యంత ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీ నివేదికపై వార్తలు ప్రచురించడానికి పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒకటో రెండో వార్తలు రాసినా అందులో వివరాలేవీ లేవు. న్యూక్లియర్ కంపెనీల ప్రయోజనాలకు నష్టకరంగా ఉండే వార్తలంటే వీటికి గిట్టవని దీని ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

Read more >>