|
Showing posts with label Did you Know?. Show all posts
Showing posts with label Did you Know?. Show all posts
Friday
.:: Current Affairs - Telugu Medium ::. ( ఆగస్టు 2012 )
Labels:
Did you Know?,
krish
Sunday
అబ్దుల్ కలాం 'టర్నింగ్ పాయింట్'

అబ్దుల్ కలాంకు మంత్రి పదవి: 98లో వాజపేయి ఆఫర్- vajpayee wanted induct kalam as minnister in NDA
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ పదవిలో కూర్చోవడానికి నాలుగేళ్ల ముందే కేంద్రమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది. 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరాలంటూ కలాంను ఆహ్వానించారు. అయితే కాలం ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇటీవల రాసిన టర్నింగ్ పాయింట్స్ పుస్తకంలో కలాం ఈ విషయాలను పేర్కొన్నారు.
వాజ్పేయి అహ్వానాన్ని అంగీకరించి ఉంటే రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు అబ్దుల్ కలాం కేంద్ర మంత్రి అయ్యేవారు. వాజ్పేయి కోరిక తీరి ఉంటే కలాం కేంద్ర మంత్రిగా మరో కొత్త పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించేవారు. అయితే, ఆయన అప్పటికే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నందున వాజ్పేయి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు.
1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఏడాది మార్చి 15న అర్ధరాత్రి వాజ్పేయి నుంచి ఫోన్ వచ్చిందని, తాను కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం జాబితా సిద్ధం చేస్తున్నానని తనను కూడా అందులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తనకు చెప్పారని, దీంతో తాను కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని చెబుతానని బదులిచ్చానని, ఆలోచించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తనను కలవాల్సిందిగా వాజ్పేయి కోరారని, అప్పటికప్పుడు తన సన్నిహిత మిత్రులతో సంప్రదింపులు మదలు పెట్టానని, తెల్లవారుజామున మూడు గంటల వరకూ మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఆ తర్వాత రోజు ఉదయం తాను ప్రధాని నివాసానికి వెళ్లి, మంత్రివర్గంలో చేరరాదన్న నిర్ణయాన్ని చెప్పానని కాలం తన పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ బృందం దేశ ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన రెండు బాధ్యతలు నెరవేర్చడంలో తలమునకలై ఉందని, ఒకటి అగ్ని క్షిపణిని అభివృద్ధి పరచడం, రెండోది అణు కార్యక్రమానికి చెందిన వరుస పరీక్షలు నిర్వహించడమని, ఈ రెండు పనులు ఎంతో కీలకమైనవని, తన పూర్తి సమయాన్ని వాటికి సంబంధించిన పనుల కోసం వెచ్చించాల్సి ఉందని, దేశం కోసం ఈ పనులు చేసేందుకు మీరు అనుమతిస్తే ముందుకు సాగుతాను అని చెప్పానని రాశారు. దీంతో మీ భావాలను తాను అభినందిస్తున్నానని, మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు సాగిపోవచ్చని వాజ్పేయి బదులిచ్చారని కలాం పేర్కొన్నారు.
2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ
2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ పైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇన్నాళ్ల తర్వాత బహిర్గతం చేశారు. రాష్ట్రపతిగా తన ఐదేళ్ల పదవీ కాలానికి సంబంధించిన అనుభవాలతో కలాం 'టర్నింగ్ పాయింట్' అనే పుస్తకాన్ని రాశారు. అది త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు మీడియాకు వెల్లడయ్యాయి. 2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యర్థిత్వంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ఆమెతో ప్రమాణ స్వీకారం జరిపించడానికి రాష్ట్రపతి భవనం సిద్ధమైందని కలాం తన పుస్తకంలో వెల్లడించారు.
వివాదాస్పద నిర్ణయాల పేరిట రాసిన పుస్తకంలోని ఓ శీర్షికలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా ప్రధాన పదవిని కోరుకొని ఉంటే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం మినహా రాజ్యాంగపరంగా మరో ప్రత్యామ్నాయమేమీ ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే అనూహ్యంగా సోనియానే మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారన్నారు. సోనియా ప్రధాని కాకపోవడమే కాదు.. మన్మోహన్ ఆ పదవిని చేపట్టడమూ తనను అమితాశ్చర్యానికి గురిచేసిందని కలాం వెల్లడించారు.
ఆ సమయంలో చాలామంది నేతలు కలిసి ఒత్తిళ్లకు లొంగకుండా సోనియాను ప్రధానిగా నియమించాలని విజ్ఞప్తి చేశారని, దీన్ని మన్నించడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు కూడా ఏమీ లేవని, ఆమె సిద్ధమై ఉంటే సోనియాను నియమించడం తప్ప తనకు మార్గాంతరం లేదని స్పష్టం చేశారు. ఊ పుస్తకం ద్వారా కలాం సోనియా అభ్యర్థిత్వానికి తాను మోకాలడ్డానన్న వాదనను పటాపంచలు చేశారు.
అప్పట్లో అబ్దుల్ కలామే సోనియా అభ్యర్థిత్వంపై విముఖత చూపినట్లుగా కథనాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అటు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే, ఇటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏ పోటీ పడ్డాయని తెలిపారు. ఆ సంకట సమయంలో తాను ఆందోళన పడటానికి తగిన కారణమే ఉందన్నారు. అయినా.. పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్కే తొలి అవకాశం ఇవ్వాలని నిర్ణయించానని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ లేఖ పంపానని చెప్పారు. ఫలితాలు వెల్లడవగానే సోనియా.. ప్రధానిని వెంట పెట్టుకొని తన వద్దకు వచ్చిన సందర్భాన్ని వివరించారు.
సోనియా కలవాలనుకుంటున్నారని తనకు తెలిపారని, ఆ రోజు (మే 18) మధ్యాహ్నం 12. 30 గంటల సమయంలో మన్మోహన్ను వెంటబెట్టుకొని ఆమె వచ్చారని, ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం తమ పార్టీకి ఉన్నట్టు చెప్పారని, కానీ, పార్టీకి మద్దతు ఇస్తూ వివిధ పార్టీలు ఇచ్చిన సమర్థన లేఖలను మాత్రం అప్పుడు ఇవ్వలేదన్నారు. 19న అందిస్తానని చెప్పారని, కానీ, అదేరోజు రాత్రి కలవాలనుకుంటున్నట్టు సోనియా నుంచి ఈ మెయిల్ అందిందన్నారు. ఆ వెంటనే ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించరాదంటూ అనేకమంది వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఈ మెయిల్ వరద పారించాయన్నారు.
ఆ రాత్రి జరిగిన భేటీలో సోనియా.. మద్దతు లేఖలను అందించానని తెలిపారు. ఆ వెంటనే తాను ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించానని చెప్పారు. మీరు సమ్మతిస్తే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పానని, అప్పుడే ఆమె మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారని, తమ పార్టీ ఆయనను ప్రధానమంత్రిగా ఖరారు చేసినట్టు వెల్లడించారని, ఆ నిర్ణయం తనను అమిత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సోనియా ప్రమాణ స్వీకారానికి చేసిన ఏర్పాట్లను అప్పటికప్పుడు మార్చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మే 22న మన్మోహన్ సింగ్ ప్రమాణం చేశారని, అప్పటికీగానీ.. పెద్ద భారం తప్పిపోయినట్టు తాను ఊపిరి పీల్చుకోలేకపోయానని వివరించారు. ఐదేళ్లలో ఇలాంటి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడేందుకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అయితే ప్రతిసారీ తన ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉండేటట్టు చూసుకున్నానని, నిర్ణయానికి ముందు న్యాయ, రాజ్యాంగ నిపుణులను తీసుకున్నానని గుర్తుచేశారు. హార్పర్ కోలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ కలాం పుస్తకం వచ్చేవారం మార్కెట్లోకి విడుదల కానుంది.
2002లో గుజరాత్ గోద్రా అనంతర అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించాలని తాను నిర్ణయం తీసుకోవడం గురించి కూడా కలాం ఈ పుస్తకంలో వివరించారు. పర్యటన వద్దని మంత్రిత్వ, అధికారవర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైందని పేర్కొన్నారు. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ సమయంలో పర్యటన అవసరమని భావిస్తున్నారా అని అడిగారని, దానికి తాను చాలా ముఖ్యమైన బాధ్యత అని బదులిచ్చానని వివరించారు.
అయితే, సోనియాపై కలాం వ్యాఖ్యలకు ఇప్పుడు విలువ లేదని జేడీ(యూ) పెదవి విరిచింది. ఈ పని ఆయన 2004లోనే చేసి ఉంటే దేశానికి మంచి జరిగేదని ఆ పార్టీ చీఫ్, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవిని వదులుకొని సోనియా పెద్ద త్యాగమేమీ చేయలేదని బిజెపి ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ గుర్తు చేశారు. గతించిన చరిత్రగా ఈ ఉదంతాన్ని సిబిఐ జాతీయ నేత రాజా అభివర్ణించారు.
Labels:
Did you Know?,
Intresting,
krish
Tuesday
ఎడ్యు న్యూస్...

మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందజేయనున్న వివిధ రకాల స్కాలర్షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీలు..
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15, 2012.
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో టెక్నికల్ కోర్సులు (ఐటీఐ సహా) 11వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు: మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందజేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
వివరాలకు: www.apsmfc.com
www.minorityaffairs.gov.in
డీఎస్సీకి పాత షెడ్యూల్ ప్రకారమే ఫీజు చెల్లింపు
రాష్ట్రంలో 21,363 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్విహ ంచే డీఎస్సీ-2012 రాత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పాత షెడ్యూలు ప్రకారమే జూలై 12వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో 13వ తేదీలోగా సమర్పించాలి.
రాత పరీక్షలను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్ 28న విడుదల చేస్తారు. డీఎస్సీ రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే 2,29,832 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్లో అర్హత పొందిన వారి నుంచి మరో 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మ్యాట్-2012
ఎంబీఏ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2012కు ప్రకటన వెలువడింది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 13, 2012
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2, 2012
వెబ్సైట్: www.aima-ind.org
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందజేయనున్న వివిధ రకాల స్కాలర్షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీలు..
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15, 2012.
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో టెక్నికల్ కోర్సులు (ఐటీఐ సహా) 11వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు: మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందజేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
వివరాలకు: www.apsmfc.com
www.minorityaffairs.gov.in
డీఎస్సీకి పాత షెడ్యూల్ ప్రకారమే ఫీజు చెల్లింపు
రాష్ట్రంలో 21,363 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్విహ ంచే డీఎస్సీ-2012 రాత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పాత షెడ్యూలు ప్రకారమే జూలై 12వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో 13వ తేదీలోగా సమర్పించాలి.
రాత పరీక్షలను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్ 28న విడుదల చేస్తారు. డీఎస్సీ రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే 2,29,832 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్లో అర్హత పొందిన వారి నుంచి మరో 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మ్యాట్-2012
ఎంబీఏ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2012కు ప్రకటన వెలువడింది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 13, 2012
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2, 2012
వెబ్సైట్: www.aima-ind.org
Labels:
Did you Know?
విస్తృత అవకాశాల వేదిక... ఫిజియోథెరపీ

హెల్త్కేర్ రంగంలో అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న రంగం ఫిజియోథెరపీ. వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు. డిమాండ్కు సరిపడా అభ్యర్థులు లేకపోవడంతో.. ఇటీవల కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ పెరిగింది.
జీవన విధానంలో వస్తున్న మార్పులు, ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఏర్పడుతుండడం, స్పోర్ట్స్, ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో ఫిజియోథెరపీ రంగాన్ని కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో విస్తృత అవకాశాల వేదికగా నిలుస్తోన్న ఫిజియోథెరపీ కెరీర్పై ఫోకస్..
ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదంలో గాయపడి కాలు, చేయి ఫ్రాక్చర్ అవడం.. లేదా బెణికినప్పుడు చేసే చికిత్స విధానాల్లో ఫిజియోథెరపిస్టులు పాలుపంచుకుంటారు. వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. క్రీడాకారులకు ఫిట్నెస్ సెంటర్లలో ట్రైనర్గా సేవలందించడానికి కూడా ఫిజియోథెరపిస్ట్లు అవసరం.
ఫిజియోథెరపీకి సంబంధించి మన రాష్ట్రంలో ఒకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ఉండే ఒకేషనల్ కోర్సుకు అర్హత పదో తరగతి. ఫిజియోథెరపిస్ట్గా కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం.. బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. ఈ కోర్సును బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)గా వ్యవహరిస్తారు. తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్స్తో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీపీటీ:
బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ). కోర్సు కాల వ్యవధి: నాలుగున్నరేళ్లు (ఆరు నెలల ఇంటర్న్షిప్తో కలిపి). మన దేశంలో దాదాపు 180 కాలేజీలు బీపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
ఇందులో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ-విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లను ఖరారు చేస్తుంది. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది
వివరాలకు: http://119.226.156.211
కావల్సిన స్కిల్స్:
ఫిజియోథెరపీ ఒక ప్రత్యేకమైన రంగం కాబట్టి ఇందులో రాణించాలంటే... కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. ఒక సమస్యకు శాస్త్రీయంగా కారణాలు చెప్పడంతోపాటు పరిష్కార మార్గాలను సూచించే నైపుణ్యం తప్పనిసరి. గంటల తరబడి పనిచేయగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. పేషెంట్ల పట్ల సానుభూతితోపాటు సహనంతో వ్యవహరించాలి. దాంతోపాటు వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలగాలి. మంచి పరిశీలన సామర్థ్యం ఉండాలి. నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి తప్పనిసరి.
అవకాశాలు:
వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టుల అవసరం ఉంటోంది. ప్రస్తుతం మన దేశంలో డిమాండ్కు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. ఒక అంచనా ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉండాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కోర్సు పూర్తి చేసిన వెంటనే ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లు, హెల్త్ ఇన్స్టిట్యూట్లు, రక్షణ శాఖ, హెల్త్ క్లబ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, మానసిక చికిత్సాలయాలు, స్పోర్ట్స్ క్లినిక్స్లలోను ఫిజియోథెరపిస్ట్గా విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా... వివిధ రిహాబిలిటేషన్ సెంటర్లల్లో కూడా అవకాశాలుంటాయి.
క్రీడారంగం కూడా చక్కని కెరీర్ అవెన్యూగా నిలుస్తోంది. ఇందులో క్రీడాకారులకు ఫిజియోలుగా, ట్రైనర్లుగా అవకాశం ఉంటుంది. ఫిట్నెస్పై ప్రజల్లో పెరుగుతన్న అవగాహనతోపాటు తదనుగుణంగా ఏర్పాటవుతున్న ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ లు ఫిజియోథెరపిస్ట్లకు డిమాండ్ను పెంచాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంఎన్సీలు కూడా విధిగా ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్లలో ప్రొఫెసర్/ఫ్యాకల్టీగా చేరొచ్చు. సొంతంగా క్లినిక్లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా వీరికి చక్కని అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజియోథెరపిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది.
వేతనాలు:
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఫిజియోథెరపిస్ట్లకు నెలకు * 10,000 నుంచి * 30,000 వరకు వేతనం లభిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఫ్రెషర్స్కు ప్రారంభంలో నెలకు * 10,000 నుంచి * 15,000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రారంభంలో నెలకు *30,000 వరకు చెల్లిస్తున్నారు. తర్వాత హోదాను బట్టి సీనియర్ ఫిజియోథెరపిస్ట్కు * 45,000, సూపరింటెండెంట్ కేడర్కు * 60-70 వేల వరకు వేతనం లభిస్తుంది.
చీఫ్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాక నెలకు *80,000 వరకు సంపాదించవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ను ఎంచుకున్నా వారికి ఇన్స్టిట్యూట్ను బట్టి ప్రారంభంలో నెలకు * 10,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీ హోదాను బట్టి నెలకు * 40,000 వరకు సంపాదించవచ్చు. చాలా మంది ఫిజియోథెరపిస్ట్లు సొంత ప్రాక్టీస్కే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణంగా ఒక్కో సిట్టింగ్ దాదాపు * 250 నుంచి * 400 వరకు చార్జ్ చేస్తారు.
విదేశాల్లో:
ఫిజియోథెరపిస్ట్లకు విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, కెనడాలలో ఫిజియోథెరపిస్ట్గా కెరీర్ ప్రారంభించాలంటే.. నేషనల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని దేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఫిజియోథెరపిస్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాలు వీరికి చక్కటి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. భారతీయ కరెన్సీలో నెలకు రూ. 50,000 నుంచి రూ.2 లక్షల వరకు లభిస్తుంది.
ఉన్నత విద్య:
బీపీటీ తర్వాత పీజీ స్థాయిలో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సులో కూడా కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టు/సెప్టెంబర్లలో వెలువడుతుంది. రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలు వివిధ స్పెషలైజేషన్స్తో ఎంపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆసక్తిని బట్టి పీహెచ్డీ కోర్సును చేయవచ్చు.
ఎంపీటీ-స్పెషలైజేషన్స్:
ఆర్థోపెడిక్స్
న్యూరాలజీ
కార్డియాలజీ అండ్ వ్యాస్కులర్ ప్లామెంటరీ
స్పోర్ట్స్ మెడిసిన్
నిమ్స్: రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలతోపాటు నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)- హైదరాబాద్ కూడా ఫిజియోథెరపీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు..
కోర్సు: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు/సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది.
ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ):
అర్హత: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలై/ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. రాత పరీక్ష ఆగస్టు/సెప్టెంబర్ లలో ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది.
వివరాలకు: http://nims.ap.nic.in
.................
దేశంలోని ప్రముఖ ఫిజియోథెరపీ కాలేజీలు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-ముంబై
వెబ్సైట్: www.aiipmr.gov.in/
పండిట్ దీన్దయాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
వెబ్సైట్: www.iphnewdelhi.in
పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-చండీగఢ్
వెబ్సైట్: www.pgimer.nic.in
కేఈఎం హాస్పిటల్ అండ్ సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్-ముంబై
వెబ్సైట్: www.kem.edu
......................
100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సు
గతంలో విద్యార్థుల్లో అంతగా అవగాహన లేక పోవడంతో బీపీటీ కోర్సుకు ఆదరణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. హెల్త్ సెక్టార్ విస్తరిస్తుండడం... పెరుగుతున్న అవకాశాల ఫలితంగా బీపీటీ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.
ప్రస్తుతం ఇది 100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సుగా గుర్తింపు పొందుతుంది. కోర్సు పూర్తి చేసిన వారికి కేవలం హెల్త్ సెక్టార్లోనే కాకుండా.. ఫిట్నెస్ సెంటర్లు, ఫిట్నెస్ ట్రైనర్గా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంఎన్సీలు ఫిట్నెస్ సెంటర్ను కచ్చితంగా నిర్వహిస్తుండడం కూడా బీపీటీ అభ్యర్థులకు వరంగా మారింది. విదేశాల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్కు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తున్నారు.
పీజీ చేస్తే ప్రారంభంలోనే నెలకు రూ. 18,000 వేతనం అందుకోవచ్చు. అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో ఫిజియోథెరపిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది. గల్ఫ్ దేశాల విషయానికొస్తే.. అక్కడి ప్రతినిధులు ఇక్కడికే వచ్చి అవసరమైన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. బీపీటీ తర్వాత ఎంపీటీ కోర్సులు చేయవచ్చు. ఆసక్తి ఉంటే పీహెచ్డీ కోర్సు చేయొచ్చు.
-విశ్వనాథ్, ప్రిన్సిపల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఫిజియోథెరపీ అండ్ పారామెడిక్స్
.................
అన్నీ పరిశీలించి ప్రవేశించాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఫిజియోథెరపీ కళాశాలకు కనిష్టంగా 30 నుంచి గరిష్టంగా 50 మంది పేషెంట్స్ కెపాసిటీ ఉన్న ఔట్ పేషెంట్ విభాగం ఉండాలి. దీంతోపాటు అనాటమీ, ఎలక్ట్రోథెరపీ తదితర ల్యాబ్ సౌకర్యాలు, ఒక్కో కళాశాలలో బ్యాచ్కు 50 మంది చొప్పున గరిష్టంగా నాలుగు బ్యాచ్లు మాత్రమే ఉండాలి. అదేవిధంగా ప్రతి కళాశాల వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండాలి.
ఫిజియోథెరపీ విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యం కలగాలనే ఉద్దేశంతో విధించిన నిబంధనలివి. కాబట్టి విద్యార్థులు కళాశాలను ఎంచుకునే ముందు వీటన్నిటినీ పరిశీలించాలి.
జీవన విధానంలో వస్తున్న మార్పులు, ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఏర్పడుతుండడం, స్పోర్ట్స్, ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో ఫిజియోథెరపీ రంగాన్ని కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో విస్తృత అవకాశాల వేదికగా నిలుస్తోన్న ఫిజియోథెరపీ కెరీర్పై ఫోకస్..
ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదంలో గాయపడి కాలు, చేయి ఫ్రాక్చర్ అవడం.. లేదా బెణికినప్పుడు చేసే చికిత్స విధానాల్లో ఫిజియోథెరపిస్టులు పాలుపంచుకుంటారు. వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. క్రీడాకారులకు ఫిట్నెస్ సెంటర్లలో ట్రైనర్గా సేవలందించడానికి కూడా ఫిజియోథెరపిస్ట్లు అవసరం.
ఫిజియోథెరపీకి సంబంధించి మన రాష్ట్రంలో ఒకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ఉండే ఒకేషనల్ కోర్సుకు అర్హత పదో తరగతి. ఫిజియోథెరపిస్ట్గా కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం.. బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. ఈ కోర్సును బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)గా వ్యవహరిస్తారు. తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్స్తో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీపీటీ:
బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ). కోర్సు కాల వ్యవధి: నాలుగున్నరేళ్లు (ఆరు నెలల ఇంటర్న్షిప్తో కలిపి). మన దేశంలో దాదాపు 180 కాలేజీలు బీపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
ఇందులో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ-విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లను ఖరారు చేస్తుంది. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది
వివరాలకు: http://119.226.156.211
కావల్సిన స్కిల్స్:
ఫిజియోథెరపీ ఒక ప్రత్యేకమైన రంగం కాబట్టి ఇందులో రాణించాలంటే... కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. ఒక సమస్యకు శాస్త్రీయంగా కారణాలు చెప్పడంతోపాటు పరిష్కార మార్గాలను సూచించే నైపుణ్యం తప్పనిసరి. గంటల తరబడి పనిచేయగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. పేషెంట్ల పట్ల సానుభూతితోపాటు సహనంతో వ్యవహరించాలి. దాంతోపాటు వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలగాలి. మంచి పరిశీలన సామర్థ్యం ఉండాలి. నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి తప్పనిసరి.
అవకాశాలు:
వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టుల అవసరం ఉంటోంది. ప్రస్తుతం మన దేశంలో డిమాండ్కు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. ఒక అంచనా ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉండాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కోర్సు పూర్తి చేసిన వెంటనే ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లు, హెల్త్ ఇన్స్టిట్యూట్లు, రక్షణ శాఖ, హెల్త్ క్లబ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, మానసిక చికిత్సాలయాలు, స్పోర్ట్స్ క్లినిక్స్లలోను ఫిజియోథెరపిస్ట్గా విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా... వివిధ రిహాబిలిటేషన్ సెంటర్లల్లో కూడా అవకాశాలుంటాయి.
క్రీడారంగం కూడా చక్కని కెరీర్ అవెన్యూగా నిలుస్తోంది. ఇందులో క్రీడాకారులకు ఫిజియోలుగా, ట్రైనర్లుగా అవకాశం ఉంటుంది. ఫిట్నెస్పై ప్రజల్లో పెరుగుతన్న అవగాహనతోపాటు తదనుగుణంగా ఏర్పాటవుతున్న ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ లు ఫిజియోథెరపిస్ట్లకు డిమాండ్ను పెంచాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంఎన్సీలు కూడా విధిగా ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్లలో ప్రొఫెసర్/ఫ్యాకల్టీగా చేరొచ్చు. సొంతంగా క్లినిక్లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా వీరికి చక్కని అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజియోథెరపిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది.
వేతనాలు:
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఫిజియోథెరపిస్ట్లకు నెలకు * 10,000 నుంచి * 30,000 వరకు వేతనం లభిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఫ్రెషర్స్కు ప్రారంభంలో నెలకు * 10,000 నుంచి * 15,000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రారంభంలో నెలకు *30,000 వరకు చెల్లిస్తున్నారు. తర్వాత హోదాను బట్టి సీనియర్ ఫిజియోథెరపిస్ట్కు * 45,000, సూపరింటెండెంట్ కేడర్కు * 60-70 వేల వరకు వేతనం లభిస్తుంది.
చీఫ్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాక నెలకు *80,000 వరకు సంపాదించవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ను ఎంచుకున్నా వారికి ఇన్స్టిట్యూట్ను బట్టి ప్రారంభంలో నెలకు * 10,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీ హోదాను బట్టి నెలకు * 40,000 వరకు సంపాదించవచ్చు. చాలా మంది ఫిజియోథెరపిస్ట్లు సొంత ప్రాక్టీస్కే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణంగా ఒక్కో సిట్టింగ్ దాదాపు * 250 నుంచి * 400 వరకు చార్జ్ చేస్తారు.
విదేశాల్లో:
ఫిజియోథెరపిస్ట్లకు విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, కెనడాలలో ఫిజియోథెరపిస్ట్గా కెరీర్ ప్రారంభించాలంటే.. నేషనల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని దేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఫిజియోథెరపిస్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాలు వీరికి చక్కటి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. భారతీయ కరెన్సీలో నెలకు రూ. 50,000 నుంచి రూ.2 లక్షల వరకు లభిస్తుంది.
ఉన్నత విద్య:
బీపీటీ తర్వాత పీజీ స్థాయిలో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సులో కూడా కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టు/సెప్టెంబర్లలో వెలువడుతుంది. రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలు వివిధ స్పెషలైజేషన్స్తో ఎంపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆసక్తిని బట్టి పీహెచ్డీ కోర్సును చేయవచ్చు.
ఎంపీటీ-స్పెషలైజేషన్స్:
ఆర్థోపెడిక్స్
న్యూరాలజీ
కార్డియాలజీ అండ్ వ్యాస్కులర్ ప్లామెంటరీ
స్పోర్ట్స్ మెడిసిన్
నిమ్స్: రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలతోపాటు నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)- హైదరాబాద్ కూడా ఫిజియోథెరపీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు..
కోర్సు: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు/సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది.
ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ):
అర్హత: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలై/ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. రాత పరీక్ష ఆగస్టు/సెప్టెంబర్ లలో ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది.
వివరాలకు: http://nims.ap.nic.in
.................
దేశంలోని ప్రముఖ ఫిజియోథెరపీ కాలేజీలు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-ముంబై
వెబ్సైట్: www.aiipmr.gov.in/
పండిట్ దీన్దయాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
వెబ్సైట్: www.iphnewdelhi.in
పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-చండీగఢ్
వెబ్సైట్: www.pgimer.nic.in
కేఈఎం హాస్పిటల్ అండ్ సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్-ముంబై
వెబ్సైట్: www.kem.edu
......................
100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సు
గతంలో విద్యార్థుల్లో అంతగా అవగాహన లేక పోవడంతో బీపీటీ కోర్సుకు ఆదరణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. హెల్త్ సెక్టార్ విస్తరిస్తుండడం... పెరుగుతున్న అవకాశాల ఫలితంగా బీపీటీ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.
ప్రస్తుతం ఇది 100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సుగా గుర్తింపు పొందుతుంది. కోర్సు పూర్తి చేసిన వారికి కేవలం హెల్త్ సెక్టార్లోనే కాకుండా.. ఫిట్నెస్ సెంటర్లు, ఫిట్నెస్ ట్రైనర్గా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంఎన్సీలు ఫిట్నెస్ సెంటర్ను కచ్చితంగా నిర్వహిస్తుండడం కూడా బీపీటీ అభ్యర్థులకు వరంగా మారింది. విదేశాల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్కు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తున్నారు.
పీజీ చేస్తే ప్రారంభంలోనే నెలకు రూ. 18,000 వేతనం అందుకోవచ్చు. అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో ఫిజియోథెరపిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది. గల్ఫ్ దేశాల విషయానికొస్తే.. అక్కడి ప్రతినిధులు ఇక్కడికే వచ్చి అవసరమైన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. బీపీటీ తర్వాత ఎంపీటీ కోర్సులు చేయవచ్చు. ఆసక్తి ఉంటే పీహెచ్డీ కోర్సు చేయొచ్చు.
-విశ్వనాథ్, ప్రిన్సిపల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఫిజియోథెరపీ అండ్ పారామెడిక్స్
.................
అన్నీ పరిశీలించి ప్రవేశించాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఫిజియోథెరపీ కళాశాలకు కనిష్టంగా 30 నుంచి గరిష్టంగా 50 మంది పేషెంట్స్ కెపాసిటీ ఉన్న ఔట్ పేషెంట్ విభాగం ఉండాలి. దీంతోపాటు అనాటమీ, ఎలక్ట్రోథెరపీ తదితర ల్యాబ్ సౌకర్యాలు, ఒక్కో కళాశాలలో బ్యాచ్కు 50 మంది చొప్పున గరిష్టంగా నాలుగు బ్యాచ్లు మాత్రమే ఉండాలి. అదేవిధంగా ప్రతి కళాశాల వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండాలి.
ఫిజియోథెరపీ విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యం కలగాలనే ఉద్దేశంతో విధించిన నిబంధనలివి. కాబట్టి విద్యార్థులు కళాశాలను ఎంచుకునే ముందు వీటన్నిటినీ పరిశీలించాలి.
Labels:
Did you Know?
పరిశోధనలకు ప్రోత్సాహం..

ఇన్స్పైర్ స్కాలర్షిప్స్
అందించేది: కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర,సాంకేతిక శాఖ విభాగం
ఉద్దేశం: 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులను పరిశోధనలవైపునకు ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) స్కాలర్షిప్లను ప్రవేశపెట్టింది.
బేసిక్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్లలో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు.. రీసెర్చ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునేవారికి ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది. నిష్ణాతులైన యువ శాస్త్రవేత్తలను దేశానికందించే ఉద్దేశంతో ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (ఎస్హెచ్ఈ) పేరుతో వీటిని ఇస్తున్నారు. ఈ ఏడాదికి స్కాలర్షిప్స్ నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం స్కాలర్షిప్స్: 10,000
ఏఏ కోర్సులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/సంస్థల్లో బేసిక్, నేచురల్ సెన్సైస్లో మొదటి ఏడాది బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న లేదా చదవడానికి నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎర్త్ సెన్సైస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందుతుంది.
కొన్ని కోర్సులకు స్కాలర్షిప్ లేదు..
ఇంజనీరింగ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ సెన్సైస్, మెడికల్ అండ్ బ యోమెడికల్ సెన్సైస్, అప్లైడ్ సెన్సైస్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఇన్స్పైర్ స్కాలర్షిప్ పరిధిలోకి రావు.
ఎన్నేళ్లపాటు:
విద్యార్థి ప్రతిభ, ఏటా అకడెమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ను పొడిగిస్తారు. ఇలా గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్షిప్ను అందుకునే సదుపాయం ఉంది.
అర్హతలు:
స్టేట్బోర్డ్స్/సెంట్రల్ బోర్డ్ 2012లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు. వీరు గుర్తింపు పొందిన వర్సిటీల్లో నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్లలో బీఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, సీబీఎస్ఈ మెడికల్ బోర్డ్ నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలలో టాప్ 10,000 ర్యాంకులలోపు సాధించి ఉండటంతోపాటు ఐఐటీలు/ఎన్ఐటీల్లో నేచురల్, బేసిక్ సెన్సైస్లో బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), జగదీశ్చంద్రబోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ (జేబీఎన్ఎస్టీఎస్) స్కాలర్స్ ఐఐఎస్ఈఆర్, నైసర్, డీఏఈ-సీబీఎస్లలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అభ్యసిస్తుండాలి.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో పతకాలు సాధించిన విద్యార్థులు బ్యాచిలర్/మాస్టర్స్ స్థాయీ కోర్సులలో నేచురల్ సెన్సైస్ చదువుతుండాలి.
వయోపరిమితి:దరఖాస్తు సమర్పించేనాటికి వయస్సు కనీసం 17 ఏళ్లు ఉండి, 22 ఏళ్లు మించరాదు.
కటాఫ్ మార్కులు:
స్టేట్బోర్డులు, సెంట్రల్ బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్షిప్లు ఇస్తారు. ఆ మార్కుల శాతం సాధించినవారు మాత్రమే ఇన్స్పైర్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి కటాఫ్ మార్కుల శాతాలను డీఎస్టీ ఇంకా విడుదల చేయలేదు. 2011లో మన రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్మీడియెట్లో నిర్దేశించిన కటాఫ్ మార్కుల శాతం 96.2
స్కాలర్షిప్ మొత్తం:
ఏడాదికి * 80,000. గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ఇందులో * 60,000 నగదు స్కాలర్షిప్ కింద చెల్లిస్తారు. మిగతా *20,000 సమ్మర్ ప్రాజెక్ట్ కోసం ఇస్తారు.
సమ్మర్టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్:
ఇన్స్పైర్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధన సంస్థలలో సమ్మర్టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ను చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో కూడా సమ్మర్ ప్రాజెక్ట్ చేయొచ్చు. దీనికోసం *20,000 మెంటార్షిప్ గ్రాంట్ ఉంటుంది.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విద్యార్థి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో.. ఎవరి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేశాడో వారి వద్ద అటెస్టేషన్ లెటర్ , ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ వివరాలను డీఎస్టీకి పంపాలి. ఇలా స్కాలర్షిప్ పొందే ఐదేళ్లు సమ్మర్ టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ను చేయాలి. దీని కోసం కేటాయించే * 20,000 వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, నివసించడానికి, ఇతర ప్రాజెక్ట్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
స్కాలర్షిప్ విడుదల:
స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదిలో రెండు విడతల్లో (* 30,000 చొప్పున) స్కాలర్షిప్ విడుదల చేస్తారు. ఇందుకోసం స్టేట్బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ)లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్లైన్ దరఖాస్తు పంపే విధానం:
నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి మార్కుల లిస్ట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ ర్యాంక్ కార్డ్, గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో చదువుతున్నట్లు లేదా నమోదు చేసుకున్నట్లు డెరైక్టర్/రిజిస్ట్రార్ లెటర్ అటెస్ట్డ్ జిరాక్స్ కాపీలను ఆర్డినరీ పోస్టులో పంపాలి. ఎన్వలప్పైన ‘అప్లికేషన్ ఫర్ ఇన్స్పైర్ స్కాలర్షిప్-2012’ అని రాయాలి.
ఆన్లైన్ దరఖాస్తు పంపే విధానం:
www.inspiredst.gov.in/online.html లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింటవుట్ తీసుకుని సంబంధిత పత్రాలతో దిగువ చిరునామాకు పంపాలి.
పూర్తిచేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (ఎన్ఐఎస్టీఏడీఎస్), డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ-110012.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తును సమర్పించాలి. జూన్ 20, 2012న ప్రకటన వెలువడింది.
వెబ్సైట్: www.inspire-dst.gov.in
................
మనదేశంలో చదువుకోవడానికి పెద్ద అడ్డంకి ఆర్థికలేమి. ఎంతోమంది విద్యార్థులకు అపార ప్రతిభాసంపత్తి ఉన్నప్పటికీ పేదరికం వారిని ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకుంటుంది. దీన్ని గుర్తించిన అనేక దేశీయ, విదేశీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మేమున్నామంటూ వారికి భరోసానిస్తున్నాయి. చదువు పూర్తయ్యేవరకు స్కాలర్షిప్స్ను అందిస్తూ విద్యార్థుల కెరీర్ ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఆయా సంస్థలందించే స్కాలర్షిప్స్పై ఫోకస్..
మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్
స్కాలర్షిప్స్ ఫర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ప్రభుత్వ గుర్తిం పు పొందిన కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందించే మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్స్ కోసం ప్రకటన వెలువడింది. ముంబైలోని కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏటా ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది.
మహిళలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు, అంగవైకల్యం గల పిల్లలకు, ఆర్మ్డ్ ఫోర్సెస్ సంతానానికి స్కాలర్షిప్స్ కేటాయింపులో ప్రాధాన్యతనిస్తారు.
స్కాలర్షిప్ మొత్తం: మూడేళ్లపాటు నెలకు * 1000 చొప్పున ఏడాదికి (10 నెలలు) * 10,000 ఇస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరిమితి మేరకు మౌఖిక పరీక్షకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దిగువ చిరునామాకు విద్యార్థులు సొంత చిరునామా ఉన్న కవరును పంపి జూలై 16వ తేదీలోగా దరఖాస్తులను పొందాలి.
దరఖాస్తులు పొందడానికి చిరునామా:
శ్రీ జయదీప్ దాస్,
డిప్యూటీ జనరల్ మేనేజర్-మార్కెటింగ్,
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
మహీంద్రా హౌస్, టి.ఎస్.రెడ్డి కాంప్లెక్స్,
1-7-1 పార్క్ లేన్, ఎస్.డి.రోడ్,
సికింద్రాబాద్-500003.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ: జూలై 16, 2012
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్సైట్: www.mahindra.com
....................
రోడ్స్ స్కాలర్షిప్
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది రోడ్స్ స్కాలర్షిప్. ఈ ఏడాదికిగాను సంబంధిత నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు కనీసం రెండేళ్లపాటు ఈ స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది.
ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం పొంది స్కాలర్షిప్నకు ఎంపిైకై..కోర్సు వ్యవధి ముగిశాక మరో కోర్సులో ప్రవేశం పొందిన కూడా స్కాలర్షిప్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.
ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ఫీజు, విమాన ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు.
అర్హత: భారతీయ పౌరులై, అక్టోబర్ 1, 2013 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్, సెన్సైస్, లా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతూ మంచి అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2012. వెబ్సైట్: www.rhodesscholarships-india.com
..................
సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్షిప్స్-న్యూఢిల్లీ
వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సాహుజైన్ ట్రస్ట్ అందించే ఇన్లాండ్ స్కాలర్షిప్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది.
ఏఏ కోర్సులకు: టెక్నికల్ ట్రేడ్ కోర్సులు
(కంప్యూటర్స్, ఇన్ఫోటెక్ కోర్సులతో సహా)
ప్రొఫెషనల్ కోర్సులు
(ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనవి)
గ్రాడ్యుయేషన్, పోస్ట్గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సు లు చదువుతున్న విద్యార్థులకు అకడెమిక్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు.
స్కాలర్షిప్ మొత్తం: కోర్సును బట్టి నెలకు * 150 నుంచి * 1000 వరకు ఈ స్కాలర్షిప్ అందుతుంది.
దరఖాస్తు విధానం: సొంత చిరునామా రాసిన 9 ఇన్టూ 4 సెం.మీ ఎన్వలప్పై * 5 స్టాంపులు అతికించి సెక్రటరీ, సాహుజైన్ ట్రస్ట్, 18, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, లోఢి రోడ్, న్యూఢిల్లీ-110003 అనే చిరునామాకు పంపి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ:జూలై20, 2012
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్సైట్: http://sahujaintrust.timesofindia.com
అందించేది: కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర,సాంకేతిక శాఖ విభాగం
ఉద్దేశం: 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులను పరిశోధనలవైపునకు ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) స్కాలర్షిప్లను ప్రవేశపెట్టింది.
బేసిక్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్లలో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు.. రీసెర్చ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునేవారికి ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది. నిష్ణాతులైన యువ శాస్త్రవేత్తలను దేశానికందించే ఉద్దేశంతో ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (ఎస్హెచ్ఈ) పేరుతో వీటిని ఇస్తున్నారు. ఈ ఏడాదికి స్కాలర్షిప్స్ నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం స్కాలర్షిప్స్: 10,000
ఏఏ కోర్సులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/సంస్థల్లో బేసిక్, నేచురల్ సెన్సైస్లో మొదటి ఏడాది బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న లేదా చదవడానికి నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎర్త్ సెన్సైస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందుతుంది.
కొన్ని కోర్సులకు స్కాలర్షిప్ లేదు..
ఇంజనీరింగ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ సెన్సైస్, మెడికల్ అండ్ బ యోమెడికల్ సెన్సైస్, అప్లైడ్ సెన్సైస్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఇన్స్పైర్ స్కాలర్షిప్ పరిధిలోకి రావు.
ఎన్నేళ్లపాటు:
విద్యార్థి ప్రతిభ, ఏటా అకడెమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ను పొడిగిస్తారు. ఇలా గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్షిప్ను అందుకునే సదుపాయం ఉంది.
అర్హతలు:
స్టేట్బోర్డ్స్/సెంట్రల్ బోర్డ్ 2012లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు. వీరు గుర్తింపు పొందిన వర్సిటీల్లో నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్లలో బీఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, సీబీఎస్ఈ మెడికల్ బోర్డ్ నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలలో టాప్ 10,000 ర్యాంకులలోపు సాధించి ఉండటంతోపాటు ఐఐటీలు/ఎన్ఐటీల్లో నేచురల్, బేసిక్ సెన్సైస్లో బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), జగదీశ్చంద్రబోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ (జేబీఎన్ఎస్టీఎస్) స్కాలర్స్ ఐఐఎస్ఈఆర్, నైసర్, డీఏఈ-సీబీఎస్లలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అభ్యసిస్తుండాలి.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో పతకాలు సాధించిన విద్యార్థులు బ్యాచిలర్/మాస్టర్స్ స్థాయీ కోర్సులలో నేచురల్ సెన్సైస్ చదువుతుండాలి.
వయోపరిమితి:దరఖాస్తు సమర్పించేనాటికి వయస్సు కనీసం 17 ఏళ్లు ఉండి, 22 ఏళ్లు మించరాదు.
కటాఫ్ మార్కులు:
స్టేట్బోర్డులు, సెంట్రల్ బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్షిప్లు ఇస్తారు. ఆ మార్కుల శాతం సాధించినవారు మాత్రమే ఇన్స్పైర్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి కటాఫ్ మార్కుల శాతాలను డీఎస్టీ ఇంకా విడుదల చేయలేదు. 2011లో మన రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్మీడియెట్లో నిర్దేశించిన కటాఫ్ మార్కుల శాతం 96.2
స్కాలర్షిప్ మొత్తం:
ఏడాదికి * 80,000. గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ఇందులో * 60,000 నగదు స్కాలర్షిప్ కింద చెల్లిస్తారు. మిగతా *20,000 సమ్మర్ ప్రాజెక్ట్ కోసం ఇస్తారు.
సమ్మర్టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్:
ఇన్స్పైర్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధన సంస్థలలో సమ్మర్టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ను చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో కూడా సమ్మర్ ప్రాజెక్ట్ చేయొచ్చు. దీనికోసం *20,000 మెంటార్షిప్ గ్రాంట్ ఉంటుంది.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విద్యార్థి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో.. ఎవరి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేశాడో వారి వద్ద అటెస్టేషన్ లెటర్ , ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ వివరాలను డీఎస్టీకి పంపాలి. ఇలా స్కాలర్షిప్ పొందే ఐదేళ్లు సమ్మర్ టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ను చేయాలి. దీని కోసం కేటాయించే * 20,000 వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, నివసించడానికి, ఇతర ప్రాజెక్ట్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
స్కాలర్షిప్ విడుదల:
స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదిలో రెండు విడతల్లో (* 30,000 చొప్పున) స్కాలర్షిప్ విడుదల చేస్తారు. ఇందుకోసం స్టేట్బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ)లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్లైన్ దరఖాస్తు పంపే విధానం:
నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి మార్కుల లిస్ట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ ర్యాంక్ కార్డ్, గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో చదువుతున్నట్లు లేదా నమోదు చేసుకున్నట్లు డెరైక్టర్/రిజిస్ట్రార్ లెటర్ అటెస్ట్డ్ జిరాక్స్ కాపీలను ఆర్డినరీ పోస్టులో పంపాలి. ఎన్వలప్పైన ‘అప్లికేషన్ ఫర్ ఇన్స్పైర్ స్కాలర్షిప్-2012’ అని రాయాలి.
ఆన్లైన్ దరఖాస్తు పంపే విధానం:
www.inspiredst.gov.in/online.html లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింటవుట్ తీసుకుని సంబంధిత పత్రాలతో దిగువ చిరునామాకు పంపాలి.
పూర్తిచేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (ఎన్ఐఎస్టీఏడీఎస్), డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ-110012.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తును సమర్పించాలి. జూన్ 20, 2012న ప్రకటన వెలువడింది.
వెబ్సైట్: www.inspire-dst.gov.in
................
మనదేశంలో చదువుకోవడానికి పెద్ద అడ్డంకి ఆర్థికలేమి. ఎంతోమంది విద్యార్థులకు అపార ప్రతిభాసంపత్తి ఉన్నప్పటికీ పేదరికం వారిని ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకుంటుంది. దీన్ని గుర్తించిన అనేక దేశీయ, విదేశీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మేమున్నామంటూ వారికి భరోసానిస్తున్నాయి. చదువు పూర్తయ్యేవరకు స్కాలర్షిప్స్ను అందిస్తూ విద్యార్థుల కెరీర్ ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఆయా సంస్థలందించే స్కాలర్షిప్స్పై ఫోకస్..
మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్
స్కాలర్షిప్స్ ఫర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ప్రభుత్వ గుర్తిం పు పొందిన కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందించే మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్స్ కోసం ప్రకటన వెలువడింది. ముంబైలోని కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏటా ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది.
మహిళలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు, అంగవైకల్యం గల పిల్లలకు, ఆర్మ్డ్ ఫోర్సెస్ సంతానానికి స్కాలర్షిప్స్ కేటాయింపులో ప్రాధాన్యతనిస్తారు.
స్కాలర్షిప్ మొత్తం: మూడేళ్లపాటు నెలకు * 1000 చొప్పున ఏడాదికి (10 నెలలు) * 10,000 ఇస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరిమితి మేరకు మౌఖిక పరీక్షకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దిగువ చిరునామాకు విద్యార్థులు సొంత చిరునామా ఉన్న కవరును పంపి జూలై 16వ తేదీలోగా దరఖాస్తులను పొందాలి.
దరఖాస్తులు పొందడానికి చిరునామా:
శ్రీ జయదీప్ దాస్,
డిప్యూటీ జనరల్ మేనేజర్-మార్కెటింగ్,
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
మహీంద్రా హౌస్, టి.ఎస్.రెడ్డి కాంప్లెక్స్,
1-7-1 పార్క్ లేన్, ఎస్.డి.రోడ్,
సికింద్రాబాద్-500003.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ: జూలై 16, 2012
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్సైట్: www.mahindra.com
....................
రోడ్స్ స్కాలర్షిప్
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది రోడ్స్ స్కాలర్షిప్. ఈ ఏడాదికిగాను సంబంధిత నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు కనీసం రెండేళ్లపాటు ఈ స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది.
ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం పొంది స్కాలర్షిప్నకు ఎంపిైకై..కోర్సు వ్యవధి ముగిశాక మరో కోర్సులో ప్రవేశం పొందిన కూడా స్కాలర్షిప్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.
ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ఫీజు, విమాన ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు.
అర్హత: భారతీయ పౌరులై, అక్టోబర్ 1, 2013 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్, సెన్సైస్, లా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతూ మంచి అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2012. వెబ్సైట్: www.rhodesscholarships-india.com
..................
సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్షిప్స్-న్యూఢిల్లీ
వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సాహుజైన్ ట్రస్ట్ అందించే ఇన్లాండ్ స్కాలర్షిప్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది.
ఏఏ కోర్సులకు: టెక్నికల్ ట్రేడ్ కోర్సులు
(కంప్యూటర్స్, ఇన్ఫోటెక్ కోర్సులతో సహా)
ప్రొఫెషనల్ కోర్సులు
(ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనవి)
గ్రాడ్యుయేషన్, పోస్ట్గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సు లు చదువుతున్న విద్యార్థులకు అకడెమిక్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు.
స్కాలర్షిప్ మొత్తం: కోర్సును బట్టి నెలకు * 150 నుంచి * 1000 వరకు ఈ స్కాలర్షిప్ అందుతుంది.
దరఖాస్తు విధానం: సొంత చిరునామా రాసిన 9 ఇన్టూ 4 సెం.మీ ఎన్వలప్పై * 5 స్టాంపులు అతికించి సెక్రటరీ, సాహుజైన్ ట్రస్ట్, 18, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, లోఢి రోడ్, న్యూఢిల్లీ-110003 అనే చిరునామాకు పంపి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ:జూలై20, 2012
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్సైట్: http://sahujaintrust.timesofindia.com
Labels:
Did you Know?
Subscribe to:
Posts (Atom)