Friday

కర్నూలులో 26 న 'రచ్చ' ఆడియో వేడుక


మెగాస్టార్ కుటుంబం ఈసారి తమ సినిమా వేడుకకు కర్నూలు పట్టణాన్ని ఎంచుకుంది. రామ్ చరణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం 'రచ్చ' సినిమా ఆడియో ఫంక్షన్ కర్నూలులో ఈ నెల 26 న నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని మెగా అభిమానుల్ని ఉత్తేజపరచడానికి ఈ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకను పబ్లిక్ ఫంక్షన్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయింది. చిత్రం విడుదల తేదీని మార్చి 29 గా నిర్ణయించారట. గత ఏడాది చరణ్ నటించిన సినిమా ఏదీ రాకపోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

0 comments:

Post a Comment