Friday

.:: Current Affairs - Telugu Medium ::. ( ఆగస్టు 2012 )



ఫోర్బ్స్ జాబితాలో మెర్కెల్‌కు మొదటి స్థానం2012 సంవత్సరానికి ప్రపంచంలో శక్తివంతులైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఆగస్టు 22న విడుదల చేసింది. 100 మంది మహిళలతో కూడిన జాబితాలో జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌కు మొదటి స్థానం దక్కింది. గతేడాది ఆమె రెండోస్థానంలో ఉన్నారు. ద్వితీయస్థానంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ , తృతీయ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌కు ఏడోస్థానం దక్కింది.
ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోస్థానంలో నిలిచారు. గత సంవత్సరం ఈ జాబితాలో ఆమెకు ఏడోస్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఇంద్ర నూయీ(పెప్సీ కంపెనీ చైర్మన్) 12వ స్థానం, పదశ్రీ వారియర్ (సిస్కో సిస్టమ్స్ సీటీవో) 58వ స్థానం, చందా కొచ్చర్ (ఐసీఐసీఐ సీఈవో)59వ స్థానం, కిరణ్ మజుందార్‌షా(బయోకాన్ అధిపతి) 80వ స్థానంలో ఉన్నారు.
పాలపుంతను పోలిన జంట గెలాక్సీలుఅంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.
డబ్ల్యూటీవోలో చేరిన రష్యా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో రష్యా ఆగస్టు 22న చేరింది. 18 సంవత్సరాల చర్చల తర్వాత డబ్ల్యూటీవోలో రష్యా సభ్యత్వం పొందింది. గత జూలైలో రష్యా ఉభయ సభలు డబ్ల్యూటీవోలో చేరికకు ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు దిగుమతి సుంకాలు, సబ్సిడీలపై డబ్ల్యూటీవో ఆంక్షలు విధిస్తుంది. డబ్ల్యూటీవో చేరిక వల్ల తయారీ రంగం, వ్యవసాయ రంగం దెబ్బతింటాయని రష్యా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇథియోపియా ప్రధాని జెనావీ మృతిఇథియోపియా ప్రధాన మంత్రి మెలెస్ జెనావీ(57) అనారోగ్యంతో ఆగస్టు 21న మరణించారు. జెనావీ 1995 నుంచి ఇథియోపియా ప్రధానిగా ఉన్నారు. 1991లో నియంత కల్నల్ యెంగిస్లూ హైలే మారియ్ పాలన ముగియడంతో మెలెస్‌కు చెందిన ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జెనావీ 1995, 2000, 2005, 2010 ఎన్నికల్లో విజయం సాధించారు.
అమెరికా హైపర్ సోనిక్ విమాన పరీక్ష విఫలంఅమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-51ఏ వేవ్ రైడర్’ అనే మానవ రహిత విమాన పరీక్ష విఫలమైంది. గంటకు 6,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన ఈ విమాన పరీక్షను ఆగస్టు 14న నిర్వహించింది. స్కామ్ జెట్ ఇంజిన్‌తో నడిచే వేవ్ రైడర్ నియంత్రణ కోల్పోయి పసిఫిక్ మహాసముద్రంలో కూలింది.


లక్ష్య-1 పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కురియన్రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.జె. కురియన్ ఆగస్టు 21న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న కె. రహ్మన్ ఖాన్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియడంతో కురియన్ ఎన్నిక అనివార్యమైంది.
క్యాట్ చైర్మన్‌గా జస్టిస్ ఆలంకేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
పృథ్వి-2 పరీక్ష విజయవంతం పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వాస్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.
కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభంకోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.
కొత్త ఈసీ నసీమ్ జైదీఎన్నికల కమిషనర్ (ఈసీ)గా సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ ఆగస్టు 7న నియమితులయ్యారు. ఇదివరకు ఈసీగా పనిచేసిన వీఎస్ సంపత్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో జైదీని కొత్త ఈసీగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. జైదీ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జైదీ యూపీ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జూలై 31న పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జైదీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మండలిలో భారత్ ప్రతినిధిగా 2005- 2008 వరకూ వ్యవహరించారు. భారత విమానాశ్రయాల సంస్థ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మరో ఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ ఉన్నారు.
విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్షమధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.
అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.
రెండోసారి ఉపరాష్ట్రపతిగా అన్సారీరెండోసారి ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 7న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీ 252 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన అన్సారీ ఎన్‌డిఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్‌పై విజయం సాధించారు. మొత్తం 790 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల్లో మూడు ఖాళీలుపోగా 787 మందికి గానూ 736 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 8 చెల్లలేదు. 47 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. చెల్లిన 728 ఓట్లలో అన్సారీకి 490, జస్వంత్ సింగ్‌కు 238 ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 నుంచి 1962 వరకు) తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రెండుసార్లు ఎన్నికైన అభ్యర్థి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ 1961 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆఫ్గనిస్తాన్, యూఏఈ దేశాల్లో ప్రధాన దౌత్య అధికారిగా పనిచేశారు. 1993-95 కాలంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. 2007 ఆగస్టు 11 నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు 2శాతం రిజర్వేషన్లుఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 29 క్రీడాంశాల్లో రిజర్వేషన్లు వర్తింప చేస్తారు. క్రీడా పోటీ, స్థాయి గెలుపొందిన పతకాల ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డుసీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.
గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతిమెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు నేసిన గొల్లభామల చీరకు జియోగ్రాఫీ ఇండికేషన్ అప్లికేషన్(జీఐఏ) గుర్తింపు లభించింది. ఈ జీఐఏ జాబితా వరుస సంఖ్య 188గా నిలవడంతో ఈ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1940లో సిద్దిపేటకు చెందిన రచ్చ రాందాస్, కాంటసాయిలు కలిసి మొదట ఈ చీరను తయారు చేశారు.
పర్యాటక రంగంలో రెండోస్థానంలో రాష్ట్రంస్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 2011లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2011లో 15.31 కోట్ల మంది రాష్ట్రాన్ని సందర్శించారు. కాగా 2011లో ఉత్తరప్రదేశ్‌ను 15.54 కోట్ల మంది సందర్శించడంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర(24.7 శాతం), రెండో స్థానంలో తమిళనాడు(17.3 శాతం), మూడోస్థానంలో న్యూఢిల్లీ(11.1శాతం) నిలిచాయి. 2011లో మొత్తం 1.94 కోట్ల మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు.
 
రాజస్థాన్‌లో అమల్లోకి విచారణ హక్కు చట్టంవిచారణ హక్కు చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రం ఆగస్టు 1 నుంచి అమలులోకి తెచ్చింది. పాలనాపరమైన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ఈ చట్టం సాయపడుతుంది. పాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని ఉద్యోగులకు ఈ చట్టం కింద రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తా మని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు.
పదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే రిజర్వేషన్లు ఇకపై పదేళ్ల కొకసారి రొటేషన్‌పై మారనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన పదేళ్ల విధానానికి ఆగస్టు 1న రాష్ట్ర మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రాష్ట్రప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిధిలో కనీసం ఐదు శాతం జ నాభా ఉంటేనే ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఎంపీ. ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కూడా మంత్రుల బృందం సానుకూలత చూపించింది.
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిహైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ప్రతిపాదనకు రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఇందుకు రాజ్యాంగంలోని 371 ప్రకరణకు సవరణ చేయవలసి ఉంది. వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని ఆరు జిల్లాలను(గుల్బర్గా,యాదగిరి, రాయచూర్, బీదర్, కొప్పళ, బళ్లారి)హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంగా పేర్కొంటారు. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వలన ఈ ప్రాంతానికి ప్రాంతీయ మండలి లేదా బోర్డు ఏర్పాటు చేస్తారు. ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారు. అభివృద్ధికి అత్యధిక గ్రాంట్లు విడుదలవుతాయి.
జీటీఏ సభ్యుల ప్రమాణ స్వీకారంగూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)లోని 45 మంది సభ్యులతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిమల్ గురుంగ్ ఆగస్టు4న ప్రమాణ స్వీకారం చేశారు. గూర్ఖాలాండ్ కొండ ప్రాంత అభివృద్ధికి జీటీఏ కృషి చేస్తోంది. కొంత కాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. 2011 జూలై 18న కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం జీటీఏ ఏర్పాటైంది. కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజెఎం) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జూలై 29 జీటీఏకు జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా 45 స్థానాలను జీజేఎం గెలుచుకుంది.



2012-13 లో 6.7 శాతం వృద్ధి 2012-13లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండగలదని సి. రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) రూపొందించిన ఆర్థిక వ్యవస్థ అంచనాల నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను పీఎంఈఏసీ ఆగస్టు 17న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. వ్యవసాయ వృద్ధిరేటు 0.5 శాతంగా (2011-12లో 2.8 శాతం), తయారీ రంగ వృద్ధి రేటు 4.5 శాతంగా (2011-12లో 2.5 శాతం), మైనింగ్ రంగంలో వృద్ధి 5.3 శాతంగా (2011-12లో 3.4 శాతం), సేవల రంగంలో వృద్ధి 8.9 శాతంగా(2011-12లో 3.4 శాతం) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వాణిజ్య లోటు 18,110 కోట్ల డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశీయ పొదుపు రేటు 31.7 శాతంగా ఉంటుంద ని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థ బయటపడి మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో పెట్టుబడులను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా రాజన్కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా (సీఈఏ) రఘురాం జి.రాజన్ ఆగస్టు 11న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజన్ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు గౌరవ ఆర్థిక సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థిక వేత్తగా పని చేశారు.
 
ఆర్‌బీఐ -త్రైమాసిక పరపతి విధానంత్రైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జూలై 31న ప్రకటించింది. రెపో రేటు 8 శాతంగా, రివర్స్ రెపో రేటు 7 శాతం కొనసాగించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)4.75లో కూడా మార్పు చేయలేదు. చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 24 నుంచి 23 శాతానికి తగ్గించింది. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టడాన్ని ఎస్‌ఎల్‌ఆర్ అంటారు. ఎస్‌ఎల్‌ఆర్ తగ్గించడం వల్ల ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ప్రస్తుత తగ్గింపులో రూ. 68,000 కోట్లు అందుబాటులోకి రాగలవని అంచనా. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతానికి తగ్గించింది. గతంలో 7.3 శాతం వృద్ధిని అంచనా వేసింది. మార్చినాటికి ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరగవచ్చని అంచనా. గతంలో ఈ అంచనా 6.5 శాతం.


పాలపుంతను పోలిన జంట గెలాక్సీలు
అంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.
 
లక్ష్య-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.
 
పృథ్వి-2 పరీక్ష విజయవంతం పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వా
స్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.
కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభంకోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.
 
భారత్‌కు ఎంబ్రాయెర్ 145
గగన తల నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ఎంబ్రాయెర్ 145 నిఘా విమానాన్ని భారత్ సమకూర్చుకుంది. దీనికి ఎంబ్రాయెర్ 145 ఏఈడబ్ల్యూసీ (ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్)గా పేరు పెట్టారు. బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయెర్ తయారు చేసిన ఈ విమానంలో భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే(ఏఈఎస్‌ఏ) రాడార్‌ను అమర్చారు. ఆగస్ట్ 17న బ్రెజిల్‌లోని శావ్‌జోస్ డాస్ కాంపోస్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులకు బ్రెజిల్ కంపెనీ ఈ విమానాన్ని అప్పగించింది. 2014 నాటికి ఇటువంటి మూడు విమానాలతోపాటు ఇతరత్రా సాంకేతిక సహకారం అందించాలని బ్రెజిల్ కంపెనీతో భారత్ కుదుర్చుకున్న 210 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా తొలి విమానం మన దేశానికి అందింది. ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను అన్ని వైపుల నుంచీ పసిగట్టగలదు.
 
విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్షమధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.
 
అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.
 
ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డుసీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.
 
అంగారక యాత్రకు క్యాబినెట్ ఆమోదంఅంగారక పరిశోధన కోసం చేపట్టే యాత్రకు కేంద్ర క్యాబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. అంగారక యాత్రలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘మార్స్ ఆర్బిటర్’ అనే ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపుతుంది. భారత్ తొలిసారి చేపట్టే అంగారక యాత్ర 2013 నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.
అరుణ గ్రహంపై వాతావరణం, పుట్టుక, పరిణామం, అక్కడ జీవ రాశుల మనుగడకు అవకాశాలు వంటి అంశాలను ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. ఇది మార్స్‌ను చేరడానికి 300 రోజులు పడుతుంది. ఈ యాత్రకు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ అధునాతన వెర్షన్ రాకెట్ ద్వారా దీనిని పంపిస్తారు. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా దేశాలు అంగారక యాత్రలు జరిపాయి. భారత్ 6వ దేశంగా ఇప్పుడు వీటి సరసన చేరనుంది.
ఐఎన్‌ఎస్ ‘బాజ్’ జాతికి అంకితంయుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘బాజ్’ను జూలై 31న అండమాన్ నికోబార్‌లో నౌకాదళం అధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ ప్రారంభించారు. దీంతో హిందూ మహా సముద్ర ప్రాంతం(ఐఓఆర్)పై నౌకాదళం మంచి పట్టు సాధిస్తుంది. ఐఓఆర్‌లో పెరుగుతున్న చైనా ఆధిపత్యం నేపథ్యంలో భారత్ దక్షిణ ప్రాంతంలో అండమాన్ నికోబార్‌లో ఈ నౌకను మోహరించడం అనివార్యమైంది.


గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
పట్నాయక్‌కు డామైన్ డట్టోన్ అవార్డుప్రతిష్టాత్మక డామైన్-డట్టోన్ అవార్డు-2012 ఒడిశా రాష్ట్ర లెప్రసీ అధికారి డా. పి.బి.కె.పట్నాయక్‌కు లభించింది. కుష్టు వ్యాధి నిర్మూలనకు చేసిన కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. గతంలో ఈ పురస్కారం లభించిన వారిలో మదర్ థెరిస్సా, బాబా ఆమ్టే తదితరులు ఉన్నారు. ఈ అవార్డును డామైన్-డట్టోన్ సొసైటీ ఫర్ లెప్రసీ ఎయిడ్ అందజేస్తుంది. దీన్ని 1944లో అమెరికా సైన్యానికి చెందిన మెడికల్ కోర్ ప్రారంభించింది. కుష్టు వ్యాధి నివారణకు విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు.
మెహతాకు రాజీవ్ సద్భావన అవార్డుజైపూర్ కేంద్రంగా పని చేసే భగవాన్ మహావీర్ వికలాంగ్ సేవా సమితి వ్యవస్థాపకుడు డీఆర్ మెహతా ఈ ఏడాది రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోని 26 దేశాల పేద ప్రజలకు ఈ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. న్యూఢిల్లీలో ఆగస్ట్ 19న జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మెహతాకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
 
అశోక్ సేన్‌కు యూరీ మిల్నర్ప్రపంచంలో భారీ మొత్తంలో నగదు బహుమతినిచ్చే ‘యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్’ ప్రైజ్ -2012 సంవత్సరానికి భారతీయ శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు లభించింది. ఈ అవార్డు కింద రూ.16.7కోట్ల (30 లక్షల అమెరికన్ డాలర్ల) నగదు బహుమతి ఇస్తారు. సేన్ ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌లోని హరిశ్చంద్ర పరిశోధనా సంస్థలో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సేన్‌తోపాటు ఏడుగురు అమెరికా శాస్త్రవేత్తలకు, పారిస్‌కు చెందిన ఒకరికి ఈ అవార్డును ప్రకటించారు. వీరికీ రూ.16.7కోట్ల చొప్పున పారితోషికం ఇస్తారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతికి మూడు రెట్లు ఎక్కువ నగదు బహుమతిని ఇచ్చే ఈ అవార్డు ప్రపంచంలోనే అత్యధిక నగదు అవార్డు. ఈ ప్రైజ్‌ను రష్యాకు చెందిన యూరీ మిల్నర్ ప్రారంభించారు. భౌతిక శాస్త్రాన్ని అభ్యసిస్తూ, 1989లో అర్ధంతరంగా చదువు మానేసిన మిల్నర్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డు నెలకొల్పారు. సేన్ పరిశోధనలకు గుర్తింపుగా గతంలో పద్మశ్రీ(2001), శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1994), భారతీయ సైన్స్ అకాడమీ(1995) అవార్డులు వరించాయి. లండన్ రాయల్ సొసైటీ ఫెలో(1998)గా కూడా సేన్ ఎంపికయ్యారు.
 
మెహతాకు రాజీవ్ సద్భావనా అవార్డుపద్మభూషణ్ డి.ఆర్.మెహతా 20వ ‘రాజీవ్‌గాంధీ సద్భావనా అవార్డు’కు ఎంపికయ్యారు. ఈయన భగవాన్ మహావీర్ వికలాంగ సాహిత్య సమితి (బీఎంవీఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు. 1975లో ఏర్పాటైన ఈ సంస్థ ‘జైపూర్ కాలు’తో వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఈ కృత్రిమ కాలును ఆప్ఘనిస్థాన్, అంగోలా వంటి దేశాల్లో యుద్ధ బాధితులకు కూడా అందజేశారు. మత సామరస్యం, శాంతికి తోడ్పడినందుకు అందజేసే ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుకరిస్తారు.


క్రీడా అవార్డులుద్రోణాచార్య అవార్డులు: క్రీడా రంగంలో కోచ్‌లకు ఇచ్చే ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు 2012 సంవత్సరానికి ఆరుగురు కోచ్‌లు ఎంపికయ్యారు. అస్లాం షేర్‌ఖాన్ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేసింది. వివరాలు.. యశ్వీర్ సింగ్ (రెజ్లింగ్); వీరేంద్ర పూనియా (అథ్లెటిక్స్); సునీల్ దేవాస్(కబడ్డీ); హరీందర్ సింగ్ (హాకీ); సత్యపాల్ (పారా అథ్లెటిక్స్); ఫెర్నాండెజ్ (క్యూబా,బాక్సింగ్); విదేశీ కోచ్‌కు ఈ అవార్డు దక్కడం ఇదే ప్రథమం
ధ్యాన్‌చంద్ అవార్డులు: ఈ అవార్డులు నలుగురు మాజీ క్రీడాకారులకు దక్కాయి. వివరాలు.. జగ్ రాజ్‌సింగ్ మాన్(అథ్లెటిక్స్); గుణ్ దీప్ కుమార్ (హాకీ); వినోద్ కుమార్(రెజ్లింగ్); సుఖ్‌బీర్ సింగ్ టోకాస్ (పారా స్పోర్ట్స్)
లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు: జె.ఎస్. భాటియా (అథ్లెటిక్స్), భవానీ ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: క్రీడలను ప్రోత్సహించినందుకుగాను ఇచ్చే ఈ అవార్డు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఎయిర్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు దక్కింది.
భారత్‌కు అండర్ -19 ప్రపంచకప్అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. టౌన్స్‌విల్లే(ఆస్ట్రేలియా)లో ఆగస్టు 26న జరిగిన ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్‌ను భారత్ మూడోసారి గెలుచుకుంది (2000, 2008లలో కూడా విజేతగా నిలిచింది). భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా, ఆస్ట్రేలియా కెప్టెన్ బసిస్టో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గా ఎంపికయ్యారు.
లాన్‌‌సపై జీవితకాల నిషేధంప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(యూఎన్‌ఏడీఏ) జీవిత కాల నిషేధం విధించింది. దీంతో 1998 నుంచి ఇప్ప టి వరకు సాధించిన అన్ని విజయాలు రద్దవుతాయి.
యూఎన్‌ఏడీఏ తనపై చేస్తున్న ఆరోపణలపై పోరాడకూడదని ఆర్మ్‌స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడంతో నిషేధం అనివార్యమైంది. 1996లో వృషణాల క్యాన్స ర్ బారిన పడ్డాడు. బతకడం అసాధ్యమనుకున్న దశ నుంచి పలు శస్త్ర చికిత్సలతో కోలుకున్నాడు. తిరిగి సైక్లింగ్ సాధన ఆరంభించి.. 1999 నుంచి 2005 వరకు వరుసగా ఏడు టూర్‌డి ఫ్రాన్‌‌స టైటిళ్లు గెలుచుకున్నాడు. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరిలో ధైర్యాన్ని నింపాడు.
 
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన లక్ష్మణ్ హైదరాబాద్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్ (37) అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 19న ప్రకటించాడు. 1996లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన లక్ష్మణ్ 1998లో వన్డేలలో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 134 టెస్ట్ట్‌లు ఆడి 17 సెంచరీలతో 8781 పరుగులు, 81 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు చేశాడు. 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన 281 పరుగులు.. భారత బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో చేసిన మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. లక్ష్మణ్‌కు 2001లో అర్జున, 2011లో పద్మశ్రీ అవార్డులు లభించాయి. 2002లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.
2012 క్రీడా బహుమతులు2012 సంవత్సరానికి రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 19న ప్రకటించింది. ఇద్దరు క్రీడాకారులకు సంయుక్తంగా రాజీవ్ ఖేల్ రత్న, 25 మందికి అర్జున అవార్డులు దక్కాయి. ఖేల్ రత్న లభించిన వారికి మెడల్‌తోపాటు రూ.7.5 లక్షలు, అర్జున అవార్డు కింద మొమెంటో రూ. 5 లక్షల నగదు బహూకరిస్తారు.
రాజీవ్ ఖేల్త్న్ర:విజయ్ కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్(రెజ్లింగ్). వీరిద్దరూ ఇటీవల ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు.
అర్జున అవార్డులు:
దీపిక, బొంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవితా రౌత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్), ఆదిత్య మెహతా (బిలియర్డ్స్), వికాస్ కృషన్ (బాక్సింగ్), యువరాజ్ సింగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), యష్‌పాల్ సోలంకీ (జూడో), అనూప్ కుమార్ (కబడ్డీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్నురాజ్ సింగ్, ఓంకార్ సింగ్, జైదీప్ కర్మాకర్ (షూటింగ్), దీపికా పల్లికల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్‌లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), బిమల్‌జిత్ సింగ్ (వుషు), దీపా మల్లిక్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్), రామ్‌కరణ్ సింగ్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్).
ఫెదరర్‌కు సిన్సినాటి టైటిల్ఏటీపీ సిన్సినాటి మాస్టర్‌‌స టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)గెలుచుకున్నాడు. ఆగస్ట్ 20న సిన్సినాటి (అమెరికా)లో జరిగిన ఫైనల్లో నొవోక్ జకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఐదుసార్లు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా 21 మాస్టర్స్ టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డును ఫెదరర్ సమం చేశాడు. మహిళా సింగిల్స్ టైటిల్‌ను చైనాకు చెందిన లీనా గెలుచుకుంది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేష్ భూపతి, రోహన్ బోపన్నలను ఓడించి రాబర్‌‌ట లిండ్ స్టెడ్ (స్వీడన్), హోరియా టెకాపు (రొమేనియా) టైటిల్ సాధించారు.
టెస్టుల్లో నెంబర్ వన్ దక్షిణాఫ్రికాఇంగ్లండ్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా.. దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుచుంది. గతేడాది భారత్ నుంచి టాప్ ర్యాంకును ఇంగ్లండ్ సాధించింది.
దీపిక పల్లికల్ రికార్డుభారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తద్వారా ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా పల్లికల్ రికార్డు సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన తారా మస్సార్ చేతిలో ఓడిపోయింది.
 
రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌కు రజతంలండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెజ్లర్ సుశీల్ కుమార్ 66 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో వరసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. సుశీల్ కుమార్ స్వస్థలం ఢిల్లీ.
యోగేశ్వర్‌కు కాంస్యంభారత్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. పురుషుల రెజ్లింగ్ 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన జోంగ్ మయాంగ్‌పై విజయంతో యోగేశ్వర్ ను కాంస్య పతకం వరించింది. క్వాలిఫయింగ్ నుంచి రెప్‌చేజ్ వరకు యోగేశ్వర్ తన హవా కొనసాగించాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఓడినా... కీలకమైన రెప్‌చేజ్‌లో మూడుబౌట్లు గెలిచి భారత్‌కు ఐదో పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన యోగేశ్వర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి.
100, 200 మీటర్ల రేసులో బోల్ట్ రికార్డ్ 100 మీటర్ల స్ప్రింట్ రేసులో ఉసేన్ బోల్ట్ (జమైకా) 9.63 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 6న జరిగిన ఈ రేసులో బోల్ట్ రికార్డ్ సృష్టించాడు. బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్ల రేసును 9.69 సెకెన్లలో పూర్తిచేసి నెలకొల్పిన రికార్డును బోల్ట్ లండన్‌లో అదిగమించాడు. బోల్ట్‌కు స్వర్ణపతకం దక్కగా మరో జమైకన్ మొహాన్ బ్లేక్ 9.75 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఆగస్టు 9న జరిగిన 200 మీ. పరుగులో, ఉసేన్ 4 ఁ 100 మీటర్ల రిలే పరుగులోను స్వర్ణ పతకాలు సాధించాడు. మూడు స్వర్ణాలు గెలిచిన తొలి స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మేరీ కోమ్‌కు కాంస్య పతకంభారత మహిళా బాక్సర్ మేరీకోమ్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఆగస్టు 8న 51 కిలోల ప్లయ్ వెయిట్ సెమీ ఫైనల్స్‌లో బ్రిటన్ బాక్సర్ నికోలో ఆడమ్స్ చేతిలో మేరీకోమ్ ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కింది. ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ ప్రవేశ పెట్టిన తొలిసారే భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టింది.
అమెరికాకు ఫుట్ బాల్‌లో స్వర్ణం:ఒలింపిక్ ఫుట్‌బాల్ స్వర్ణ పతకాన్ని అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో జపాన్‌ను ఓడించింది.
హాకీలో జర్మనీకి స్వర్ణం: హాకీలో జర్మనీకి స్వర్ణం.
అమెరికాకు మహిళ బాస్కెట్ బాల్: మహిళ బాస్కెట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అమెరికా స్వర్ణం సాధించింది.
నార్వేకి మహిళ హ్యాండ్‌బాల్: మహిళ హ్యాండ్‌బాల్‌లో నార్వే స్వర్ణం సాధించింది. మాంటెనెగ్రోను నార్వే ఓడించింది. పురుషుల హ్యాండ్‌బాల్‌లో స్వీడన్‌ను ఓడించి ఫ్రాన్స్ స్వర్ణం సాదించింది.
మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్‌కు స్వర్ణం: మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్ స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో బ్రెజిల్ అమెరికాను ఓడించింది. పురుషుల వాలీబాల్ టైటిల్‌ను రష్యా గెలుచుకుంది. ఫైనల్లో బ్రిటన్‌ను ఓడించి రష్యా విజయం సాధించింది.
లండన్ ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో అమెరికాఆగస్టు 12న ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో 46 స్వర్ణపతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రజత, కాంస్య పతకాలతో కలిపి మొత్తం 104 పతకాలు అమెరికా సాధించింది. 38 స్వర్ణాలతో చైనా, 29 స్వర్ణాలతో బ్రిటన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 6 పతకాలు సాధించి 55వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా 6 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తం 204 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనగా 85 దేశాలు మాత్రమే పతకాలు సాధించాయి. భారత్ 55వ స్థానంలో నిలిచింది.
పతకాలు సాధించిన భారత్ విజేతలువిజయకుమార్ - షూటింగ్ - రజతం
సుశీల్ కుమార్ - రెజ్లింగ్ - రజతం
సైనా నెహ్వాల్ - బ్యాడ్మింటన్ - కాంస్యం
గగన్ నారంగ్ - షూటింగ్ - కాంస్యం
మేరీ కోమ్ - బాక్సింగ్ - కాంస్యం
యోగేశ్వర్ దత్ - రెజ్లింగ్ - కాంస్యం
పతకాల పట్టికలో మొదటి పది దేశాలుజట్టు స్వ ర కాం మొఅమెరికా 46 29 29 104
చైనా 38 27 22 87
బ్రిటన్ 29 17 19 65
రష్యా 24 25 33 82
ద.కొరియా 13 8 7 28
జర్మనీ 11 19 14 44
ఫ్రాన్స్ 11 11 12 34
ఇటలీ 8 9 11 28
హంగేరి 8 4 5 17
ఆస్ట్రేలియా 7 16 12 35
 
విజయ్ కుమార్‌కు రజతంషూటర్ విజయ్ కుమార్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విజయ్‌కుమార్ ఆగస్టు 3న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం గెలిచాడు. క్వాలిఫైయింగ్‌లో 600కుగాను 585 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ రికార్డును అధిగమించిన విజయ్ ఫైనల్‌లో 40కు 30 పాయింట్లు స్కోర్‌చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఒకే క్రీడా విభాగంలో రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి కాగా షూటింగ్‌లో రజతం రావడం రెండోసారి. భారత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న విజయ్ 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని కైవసం చేసుకున్నాడు.
ముర్రేకు పురుషుల సింగిల్స్ టైటిల్ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. ఆగస్టు 5న ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్‌పై ముర్రే విజయం సాధించాడు.
మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను అమెరికాకు చెందిన వీన స్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌లు గెలుచుకున్నారు.
మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ స్వర్ణపతకం సాధించింది.
పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్‌లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
సైనాకు కాంస్యంఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్ ్సలో భారత్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానానికి ఆగస్టు 4న జరిగిన పోటీలో ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌వాంగ్ గాయంతో పోటీ నుంచి విరమించుకోవడంతో సైనాకు కాంస్యం దక్కింది. భారత్‌కు ఇది మూడో పతకం.
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన క్రీడాకారిణిగా సైనా ఘనత సాధించింది. సెమీస్‌లో ప్రపంచ నెంబర్‌వ న్ యిహాన్ వాంగ్ చేతిలో ఓడిన సైనా కాంస్యం కోసం కూడా తనకన్నా మెరుగైన ర్యాంకర్‌తోనే ఆడింది. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన మొదటి మహిళ, భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో మహిళగా సైనా రికార్డు సృష్టించింది.
పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన లీ చాంగ్‌పై లిన్ డాన్ విజయం సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా లిన్ డాన్ స్వర్ణం సాధించాడు.
పురుషుల డబుల్స్: చైనాకు చెందిన కాయ్‌యున్, ఫు హాయ్ ఫింగ్‌లు డెన్మార్క్‌కు చెందిన మథియస్ బో, కర్‌స్టన్ ముంగిన్సన్‌లను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
మహిళల సింగిల్స్: చైనాకు చెందిన లీ జురుయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. యిహాన్ వాంగ్ పై లీ జురయ్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో పోటీ పడిన ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు.
మహిళల డబుల్స్: టియాన్ క్వింగ్ , జావోయిలు స్వర్ణాన్ని గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మిజుకి ఫుజి, రీకా కాకివాలపై వీరు విజయం సాధించారు.
వన్డే సిరీస్ విజేత భారత్శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంకలో ఆగస్టు 4న జరిగిన చివరి, ఐదో వన్డేను భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇర్ఫాన్ పఠాన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు.


మంత్రిగా జానారెడ్డి రికార్డుఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం మంత్రిగా కొనసాగి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి రికార్డు నెలకొల్పారు. ఆగస్టు 24 నాటికి ఆయన మంత్రిగా 14 సంవత్సరాలు 11 నెలలు పదవీ కాలాన్ని చేసుకున్నారు. దీంతో 14 సంవత్సరాల 10 నెలల 28 రోజులు మంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డును అధిగమించారు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. జానారెడ్డి ఎన్టీఆర్ హయాంలో ఆపద్ధర్మంతో కలిపి మూడు పర్యాయాలు..1983, 1984, 1985లలో(6 ఏళ్ల రెండు రోజులు) మంత్రిగా పని చేశారు. తర్వాత 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో నాలుగో దఫా రెండేళ్ల రెండు నెలల నాలుగు రోజుల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతిచంద్రుడిపై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(82) ఆగస్టు 25న అమెరికాలోని సిన్‌సిటీలో మరణించారు. 1969 జూలై 20న అపోలో 11 వ్యోమనౌక ద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టారు. ఈయనతోపాటు చంద్రమండల యాత్రకు వెళ్లిన బృందంలో ఎడ్విన్ ఆల్ట్రిన్, మైకేల్ కాలిన్స్ ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ట్రిన్‌లు మూడు గంటలపాటు చంద్రుడిపై గడిపారు. నమూనాలు సేకరించి ఫోటోలు తీసారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు.
గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
మిస్ వరల్డ్ వెన్ జియా యూచైనాకు చెందిన వెన్ జియా యూ (23) 2012 ప్రపంచ సుందరిగాఎంపిక య్యారు. ఆగస్టు 18న ఓర్డోస్ (చైనా)లో జరిగిన పోటీలో వెన్‌జియా యూ విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి రన్నరప్‌గా సోఫీ మౌల్డ్స్(వేల్స్), రెండో రన్నరప్‌గా జెస్సికా కహావటి (ఆస్ట్రేలియా) నిలిచారు. భారత్‌కు చెందిన వాన్యా మిశ్రాకు ఆరో స్థానం దక్కింది. చైనాకు ఈ టైటిల్ రావడం ఇది రెండో సారి. 2007లో ఆ దేశానికి చెందిన జాంగ్ జిలిన్ మిస్ వరల్డ్ కిరీటం ద క్కించుకుంది.
కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతికేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (67) ఆగస్టు 14న చెన్నైలో కాలేయ వ్యాధితో మరణించారు. 1980లో తొలిసారి లాతూర్ స్థానం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన రెండు స్లారు (1999-2003, 2004-08 మధ్య కాలంలో) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2009 నుంచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
చిత్రకారుడు కాపు రాజయ్య మృతిప్రముఖ చిత్రకారుడు కళారత్న కాపు రాజయ్య (83) ఆగస్ట్ 20న మెదక్ జిల్లా సిద్ధిపేటలో మరణించారు. డ్రాయింగ్ టీచర్‌గా ఎందరికో తర్ఫీదునిచ్చిన రాజయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 1990లో ఆయన కల్లుగీత కార్మికుల జీవితంపై రూపొందించిన చిత్రానికి జాతీయ అవార్డు లభించింది.
1990లో కేంద్ర అకాడెమీ పురస్కారం 2000లో రాష్ర్ట ప్రభుత్వ హంస పురస్కారంతో పాటు అనేక సత్కారాలు ఆయన పొందారు.
మన్మోహన్ రికార్డుభారతదేశ 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆగస్ట్ 15న ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఎర్రకోటపై ఎక్కువ సార్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించారు. మన్మోహన్ 2004 ఆగస్ట్ 15న తొలి సారిగా ఎర్రకోటపై జెండా ఎగరవేశారు. మన్మోహన్ కంటే ముందు ఆ పదవిలో ఉన్న బీజేపీ నేత వాజ్‌పేయి ఆరు సార్లు జాతీయ పతాకావిష్కరణ చేశారు.
 
లోక్‌సభ నాయకుడిగా ‘షిండే’కేంద్ర హోం మంత్రిగా కొత్తగా నియమితులైన సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ నాయకుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, షిండేని లోక్‌సభ నాయకుడిగా నామినేట్ చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆగస్టు 3న ప్రకటించారు. లోక్‌సభ నాయకుడిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో షిండేని నియమించారు.


From :-
Sakshi

0 comments:

Post a Comment