Monday

దుబాయ్‌లో ఇద్దరు భారతీయుల ఆత్మహత్య...!


 ఉపాధి కోసం బహ్రైన్ వెళ్లిన ఇద్దరు భారతీయులు వేర్వేరు పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... ముత్తయ్య న్యావనంది చిన్న పోచయ్య బిల్డింగ్ మెయింటెనెన్స్ పనికోసం బహ్రైన్ వచ్చాడు. శుక్రవారం తన రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించాడు. కుటుంబకలహాలే ఇతడి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో కేరళవాసి 28 ఏళ్ల షాను జాన్సన్ కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. విధుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన అతడి భార్య నాన్సీ విగతజీవుడైన భర్తను చూసి కన్నీరుమున్నీరైంది.

0 comments:

Post a Comment