Tuesday

ద్రాక్ష గింజలతో క్యాన్సర్ దూరం...........................

ప్రపంచంలో ప్రతి ఏటా అయిదు లక్షల మందిని బలిగొంటున్న క్యాన్సర్ కారకాలైన సెల్స్‌ను నిర్మూలించేందుకు ద్రాక్ష గింజలతో సాధ్యమవుతుందని తాజాగా నిపుణులు జరిపిన అధ్యయనంలో తేలింది. ద్రాక్ష గింజలతో తయారు చేసిన ఔషధం క్యాన్సర్ వ్యాధి వచ్చిన శరీర భాగాల్లోని కణజాలంలో క్యాన్సర్ కారకాన్ని నివారిస్తుందని కోలోరాడో యూనివర్శిటీ క్యాన్సర్ సెంటర్ ప్రొఫెసర్ రాజేష్ అగర్వాల్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయి. 

ఎంత త్వరగా వ్యాప్తి చెందుతాయో చికిత్స చేస్తే అంత త్వరగా ఉనికిని కోల్పోతాయని ప్రొఫెసర్ పరిశీలనలో తెలిసింది. క్యాన్సర్ వ్యాధి సోకిన శరీర భాగాల్లో హానికరమైన క్యాన్సర్ కణాలను చంపే స్వభావం ద్రాక్ష గింజల్లో ఉందని అగర్వాల్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది.మరి ఇంకెందుకు ఆలస్యం క్యాన్సర్ కారకాలైన కణాలను నిర్మూలించే ద్రాక్ష గింజలతో చేసిన ఔషధాన్ని మనమూ వాడదాం.

0 comments:

Post a Comment