Saturday

అభిషేక్ బచ్చన్ తో పూరీ ‘బిజినెస్ మేన్’


‘పోకిరీ’ తర్వాత మళ్లీ చాలా కాలానికి మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ‘ది బిజినెస్ మేన్’ పేరుతో ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలాఖరుకి ఈ షూటింగును ప్రారంభించడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేశారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇదే చిత్రాన్ని ఏక కాలంలో హిందీలో కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ లో హీరోగా అభిషేక్ బచ్చన్ నటిస్తాడు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన పోకిరీ సినిమా అభిషేక్ కి బాగా నచ్చిందట. అప్పటి నుంచీ ఆయన డైరెక్షన్ లో నటించాలనుకుంటున్న అభీకి ఈ ఆఫర్ ఎంతో సంతోషాన్నిచ్చిందట.

0 comments:

Post a Comment