Monday

'మగధీర' కాంబినేషన్ రిపీట్ చేస్తున్న వినాయక్


'మగధీర' సినిమాతో హీరోగా తానేవిటన్నది రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. అలాగే మాస్-యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వి.వి. వినాయక్. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సంచలనాత్మక చిత్రం రూపొందబోతోంది. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమాకి డి. వి. వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభించడానికి కావాల్సిన సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ సరసన ఓ కథానాయికగా కాజల్ నటించబోతోంది. మరో కథానాయిక ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత దానయ్య చెప్పారు. మీడియాలో వచ్చినట్టు హన్సిక మాత్రం కాదన్నారు. ఈ సినిమా వినాయక్ స్టైల్ లోనే ఉంటుందనీ...సెంటిమెంట్, యాక్షన్, వినోదాంశాల మేళవింపుతో రామ్ చరణ్ అభిమానులకి సంతృప్తినిస్తుందని అన్నారు. 'మగధీర' తర్వాత కుదిరిన రామ్ చరణ్ --కాజల్ కాంబినేషన్ ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. అప్పుడే ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ లోనూ, అటు ఆడియన్స్ లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి. ఊహాగానాలతో ఊరిస్తూ మొదలు కాబోతోన్న ఈ సినిమా భారీ విజయాన్నే బహుమానంగా ఇస్తుందని ఆశిద్దాం !

0 comments:

Post a Comment