Tuesday

యోగా

ప్రాణ ముద్ర
పద్మాసనంలో గానీ సుఖాసనంలో కానీ కూర్చుని ఐదు నుంచి పది దీర్ఘ శ్వాసలు తీసుకుని వదలాలి. తరువాత ప్రశాంత చిత్తంతో రెండు చేతులతో ముద్రను సాధన చెయ్యాలి. ఈ ముద్రను ఏ సమయంలోనైనా సాధన చెయ్యవచ్చు.

ఇలా చేయాలి...
చిటికెన వేలు, ఉంగరం వేలు,బొటన వేలు పై భాగాలను ఒకదానినొకటి తాకేలా ఆనించాలి. మిగిలిన వేళ్లను నిలువుగా పెట్టాలి.
ఈ ముద్ర ప్రాణ శక్తికి కేంద్రము. కాబట్టి ఈ ముద్రను సాధన చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి జబ్బులు తగ్గి దృష్టి మెరుగవుతుంది.

0 comments:

Post a Comment