Tuesday

'ఇకపై రీమేక్స్ చేయ'నంటున్న శంకర్...!


 తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఎప్పుడూ రీమేక్స్ ముట్టని తమిళ దర్శకుడు శంకర్ తాజాగా 'త్రీ ఇడియట్స్' హిందీ చిత్రాన్ని రీమేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే వ్రతం చెడినా ఫలితం మాత్రం దక్కనందుకు శంకర్ ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాడు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఆహా... ఓహో అంటూ పబ్లిసిటీ పొందినా, ప్రేక్షకుల్ని మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా శంకర్ అభిమానులు ఈ సినిమా చూసి పెదవి విరిచేస్తున్నారు. మా శంకరేంటి... ఇలాంటి సినిమా తీయడమేంటి... అంటూ తలలు బాదుకుంటున్నారట.
     దీనిని దృష్టిలో పెట్టుకునే, 'ఇకపై రీమేక్స్ చచ్చినా చేయను' అంటూ శంకర్ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. 'రోబో' సినిమా షూటింగు సమయంలో పూనాలో ఈ సినిమా చూసి, అనుభూతి చెందాననీ, ఆ అనుభూతిని తమిళ ప్రేక్షకులకి కూడా అందించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రీమేక్ చేశాననీ వివరణ ఇచ్చుకున్నాడు. ఈ చిత్ర నిర్మాణం తనకొక కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాడు. చిరంజీవి నటించే 150 వ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడంటూ వస్తున్న వార్తలని ఆయన దృష్టికి తీసుకువెళితే, ప్రస్తుతం తాను హాలిడే ఎంజాయ్ చేస్తున్నానని నవ్వుతూ చెప్పాడు శంకర్. 

0 comments:

Post a Comment