Friday

పాక్ జవాన్లను హతమార్చిన తెహ్రీక్


తాలిబన్ పాక్ విభాగమైన తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అన్నంత పనీ చేసింది. అమాయకులను తప్ప, పాక్ సైన్యాన్ని, ఇతర భద్రతా దళాలను మాత్రం వదిలేది లేదని ప్రకటించిన టీటీపీ.. హెచ్చరిక చేసిన 24 గంటలు గడవకముందే పాక్ భద్రతా దళాలకు చెందిన 15 మంది జవాన్లను హతమార్చింది. 

వారి దేహాలన్నిటినీ నగ్నంగా చేసి ఓ పొలంలో కుమ్మరించింది. ఇంతటితో వదలమని, మరెన్నో ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించింది. ఉగ్రవాదుల మహిళా కుటుంబ సభ్యులను సైన్యం తమ చెరలో ఉంచుకొన్నందుకు ప్రతీకారంగా వీరిని మట్టుపెట్టినట్టు టీటీపీ పేర్కొంది.

0 comments:

Post a Comment