Tuesday

8న సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష


 వచ్చే విద్యా సంవత్సరంలోసైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల్లో చేరదలచుకున్న విద్యార్థుల కోసం ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ మురళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి: గుంటూరు-6/7 బ్రాడిపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్, సికింద్రాబాద్-కీస్ గర్ల్స్ హైస్కూల్, కరీంనగర్- గంజ్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, తిరుపతి-టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌కి ఎదురుగా ఉన్న గోవిందరాజుస్వామి హైస్కూల్, విశాఖ-పాత పోస్టాఫీసు సమీపంలోని సెయింట్ ఎలోయిసస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్, విజయనగరం-సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడి యం హైస్కూల్.

గత నెల 31నాటికే అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేశామనీ, అం దనివారు ఫోన్ నంబర్లు: 08922-208299, 246128లలో సంప్రందించాలనీ, వివరాల కోసం సైనిక స్కూల్ కోరుకొండ వెబ్‌సైట్‌ని చూడాలని ప్రిన్సిపాల్ సూచించారు.

0 comments:

Post a Comment