Tuesday

సోనియా గ్రీటింగ్ కార్డుపై రాజీవ్ తీసిన ఫొటో...


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతి నూతన సంవత్సరం సందర్భంగా పార్టీలో ముఖ్యులైన నేతలకు, ఎంపీలకు గ్రీటింగ్ కార్డు పంపుతారు. కానీ ఈసారి ఆమె పంపిన గ్రీటింగ్ కార్డు పార్టీ నేతలను ఎంతో ఆకట్టుకుంటోంది. ఎందుకంటే.. ఈ సారి గ్రీటింగ్ కార్డుపై సోనియా భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసిన ఫోటోను ముద్రించారు.

చేతిలో అన్నం ముద్దను పట్టుకున్న ఒక కాశ్మీరీ అమ్మాయి ఫొటో అది. దానిని రాజీవ్ 1979లో తీశారు. ఫోటోగ్రఫీ రాజీవ్ గాంధీకి ఇష్టమైన హాబీ. ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సోనియా ఈ ఫోటోను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అటు ఆహార భద్రత, ఇటు ముస్లిం అమ్మాయిని ప్రతిబింబించేలా ఈ గ్రీటింగ్ కార్డును రూపొందించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

0 comments:

Post a Comment