Wednesday

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి కాల్చివేత


 బ్రిటన్‌లో 23 ఏళ్ల భారతీయ విద్యార్థి అనూజ్ బిద్వే హత్యకు గురయ్యాడు. మహారాష్ట్రలోని పుణె అతని స్వస్థలం. లంకెస్టర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న బిద్వె క్రిస్మస్ సెలవులు గడిపేందుకు మాంచెస్టర్ వచ్చాడు. మంగళవారం ఆయన ఓ రహదారిపై వెళుతుండగా శ్వేతజాతీయులు రహదారిపై అడ్డగించి కాల్పులు జరిపారు. వెంటనే మాంచెస్టర్‌లోని ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యు లు ప్రకటించారు. 

ఈ హత్యకు సంబంధించి 17ఏళ్ల టీనేజర్‌ను బ్రిటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అ కారణంగానే కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్నామని, అయితే ఇప్పటికిప్పుడే ఏదీ నిర్ధారించలేమని పోలీ సులు చెప్పారు. వర్ణవివక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టిన ట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు స హకరించాలని బిద్వే తండ్రి సుభాష్ ఫేస్‌బుక్ ద్వారా అ భ్యర్థించారు. కాగా.. దుబాయ్‌లో మితిమీరిన కారు వే గం ఇద్దరు భారతీయులను బలిగొంది. వారు రోడ్డు దా టుతుండగా.. జీకే(16) అనే టీనేజర్ తన కారుతో వేగం గా ఢీ కొట్టాడు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

0 comments:

Post a Comment