Tuesday

మలేసియా యజమాని అకృత్యం తెలుగు మహిళపై ఏడాదికి పైగా అత్యాచారం ...


తన మలేసియన్ యజమాని దాదాపు ఏడాదికి పైగా తనపై అత్యాచారం చేశాడంటూ ఓ తెలుగు మహిళ(26) ఆరోపించింది. తనపేరు 'ఎస్' అని మాత్రమే చెప్పిన ఆమె.. మలేసియాలో ఓ సన్‌డ్రై స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేసేందుకు 2010లో వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఆమెకు 2011 నుంచి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే యజమాని దాదాపు ప్రతిరోజూ తనపై అత్యాచారం చేసేవాడని, ఎప్పుడైనా ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టేవాడని ఆమె వా పోయింది.

అతడి కారణంగా తాను రెండుసార్లు అబార్షన్లు చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పింది. గత నెలలో తప్పించుకున్న తాను ఓ చర్చి, మరో మానవహక్కుల సంఘం నుంచి సాయం పొందానంది. ఈ విషయమై తాను భారత హైకమిషన్‌కు, కార్మికశాఖకు, పోలీసులకు ఫిర్యాదులు చేసినా, వాళ్లు తన యజమానిని హెచ్చరించి వదిలేశారే తప్ప చర్యలు తీసుకోలేదని వాపోయింది.

0 comments:

Post a Comment