Friday

మరోసారి మోసపోయిన నయనతార...!


 అందాల నయనతార మగాడి చేతిలో మరోసారి మోసపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. నయనతార చిన్నాన్న, చిన్నమ్మ తమిళనాడులోని అంబత్తూరులో ఈవేళ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నయనతారని ప్రభుదేవా ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. గతంలో హీరో శింబు కూడా ఇలాగే ప్రేమ కబుర్లు చెప్పి నయనతార నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగేశాడనీ, ఇప్పుడు ప్రభుదేవా కూడా అదే పని చేశాడనీ వారు అంటున్నారు.
      శింబు హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'వల్లవన్' చిత్రానికి నయనతార కోట్లలో ఆర్ధిక సాయం చేసిందని వెల్లడించారు. పెళ్లయ్యాక ఇక సినిమాలలో నటించనని నయనతార చెప్పడంతో, ప్రభుదేవా ఆమెకు మెల్లిగా దూరం అయ్యాడని అన్నారు. సినిమాలలో నటించకపోతే ఇక డబ్బులు రావన్నది అతని ఆలోచన అనీ, డబ్బు లేనప్పుడు నయనతార ఎందుకని, అతను అనుకున్నాడని వారు అంటున్నారు. ఇప్పటికైనా తమ అమ్మాయి అసలు విషయం గ్రహించాలని వారు కోరారు. వీరు చేసిన వార్తల పట్ల నయనతార ఇంకా స్పందించలేదు. ఈ వ్యాఖ్యలు మాత్రం అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ కలకలం సృష్టించాయి.

0 comments:

Post a Comment