Saturday

సింగపూర్ వెళ్లి రజనీని కలిసిన చిరంజీవి


ఇటీవల అనారోగ్యానికి గురై సింగపూర్లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న విషయం మనకు తెలుసు. కాగా, రజనీని కలిసి పలకరించడానికి మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ప్రత్యేకంగా సింగపూర్ వెళ్లారు. రజనీని ఆయన అపార్ట్ మెంటులో కలిసి, ఆరోగ్యం గురించి, తీసుకుంటున్న ట్రీట్ మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి తన రాజకీయ కార్యకలాపాల్లో ఇటీవల బిజీగా వుండడం వల్ల, రజనీని చెన్నయ్ లో వుండగా కలవడం కుదరలేదు. వీరిద్దరూ గత మూడు దశాబ్దాలుగా మంచి మిత్రులు. కెరీర్ ప్రారంభంలో ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.

0 comments:

Post a Comment