Saturday

అమెరికాలో యమధర్మరాజు పర్యటన


సాయిరామ్ శంకర్ - పార్వతిమెల్టన్ జంటగా 'యమహో యమః' చిత్రం తెరకెక్కుతోన్న విషయం ప్రేక్షకులకి విదితమే. జీవీకే ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ గౌడ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జితేందర్ .వై  దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రని శ్రీహరి పోషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ రాయలసీమలో జరిగిన షెడ్యూల్ లో ప్రధాన పాత్రల మధ్య పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తదుపరి షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేశారు. మార్చ్ మొదటివారం నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత చెప్పారు. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ - పార్వతి మెల్టన్ ల మధ్య చోటు చేసుకునే రొమాంటిక్ సన్నివేశాలు కనువిందు చేస్తాయనీ ... అమెరికాలో యమధర్మరాజు చేసే సందండి కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. గతంలో యమలోకం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించడం వల్ల తమ సినిమా కూడా సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాత వున్నారు. మరి ఈ సినిమా ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి. 

0 comments:

Post a Comment