Tuesday

జర్నలిస్టు అవతారంలో పవన్ కల్యాణ్...!


పవన్ కల్యాణ్ త్వరలో జర్నలిస్టు అవతారం ఎత్తనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అలా అని, ఆయన టీవీ చానెల్ ఏమీ పెట్టడం లేదులెండి... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో జర్నలిస్టు పాత్ర పోషిస్తాడట. మీడియా, మాఫియా సంబంధాల చుట్టూ ఈ సినిమా కథ అల్లుతున్నారని తెలుస్తోంది. అలాగే, రాజకీయనాయకులపై కూడా ఇందులో ఘాటైన విమర్శలు, సెటైర్లు వుంటాయట. మామూలుగానే పూరీ జగన్నాథ్ కి మీడియా అంటే కాస్త చిన్న చూపు. అందుకే, మీడియాపై తన సినిమాల్లో ఎక్కువగా సెటైర్లు వేస్తుంటాడు. అలాగే, ఈ చిత్రంలో కూడా మీడియాను రెండు వైపులా చూపిస్తాడని అంటున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. వచ్చే మే నెలలో షూటింగు ప్రారంభించి దసరాకి చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

0 comments:

Post a Comment