Tuesday

యూపీలో ఎస్ఎంఎస్‌ల భూకంపం...


ఉత్తరప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకే లేదు. సోమవారం రా త్రంతా వారు జాగరణ చేయాల్సి వచ్చింది. రాష్ట్రాన్ని భూకంపం కుదిపేయనుందనే వ దంతులే ఇందుకు కారణం. కొందరు ఆకతా యిలు ఇచ్చిన బూటకపు ఎస్ఎంఎస్‌లతో ప లు జిల్లాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్ల బయటే కునికిపాట్లు పడుతూ భయం, భయంగా గడిపారు. వదంతులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న దానిపై యూపీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

0 comments:

Post a Comment