Monday

మన్మోహన్ నిజాయితీపరుడు: గిలానీ


 భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మన్మోహన్‌సింగ్‌ను 'నిజాయితీపరుని'గా అభివర్ణించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల సందర్భంగా గిలానీ శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. కీలకమైన కాశ్మీర్‌తోసహా పాక్‌తో దైపాక్షిక సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న మన్మోహన్‌సింగ్ 'నిజాయితీపరుడ'ని కితాబిచ్చారు. గతంలో గిలానీని శాంతిదూతగా ప్రధాని మన్మోహన్‌సింగ్ అభివర్ణించిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a Comment