Wednesday

ఒకే కాన్పులో నలుగురు.. అంతా క్షేమం




 తొలి కాన్పులోనే నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిందో మహిళ. కృష్ణాజిల్లా కాకరవాయి ఖమ్మంపాడుకు చెందిన వ్యవసాయ కూలీ మరియమ్మ మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలోని సంజీవని ఆస్పత్రిలో ప్రసవించింది. మామూలు కాన్పులోనే ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిందని, తల్లితో పాటు శిశువులు కూడా క్షేమంగానే ఉన్నారని వైద్యుడు రాంబాబు చెప్పారు. నలుగురిలో ముగ్గురు మగపిల్లలు, ఒకరు ఆడ శిశువు ఉన్నారని తెలిపారు.

0 comments:

Post a Comment