Thursday

జంతుశాస్త్ర బోధన పేరిట కళాశాలల్లో జీవహింసకుస్విస్తి



న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జీవశాస్త్ర బోధన పేరిట ఏటా బ లైపోతున్న 1.90 కోట్ల మూగజీవుల రక్షణకు జీవకారు ణ్య సంస్థ 'పెటా' (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్) సాగించిన కృషి ఫలించింది. ఈ మేరకు ఈ అమానుషానికి స్వస్తి పలకాల్సిందిగా సిఫారసు చేస్తూ యూజీసీ అధికారికంగా మార్గదర్శకాలను జారీచేసిం ది. కాగా, బాలీవుడ్ నటుడు రాహుల్‌బోస్ తోడ్పాటుతో ఈ విజయం సాధించినట్లు పెటా వర్గాలు చెబుతు న్నా యి. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972, జంతుహింస నిరోధక చట్టం-1960కు అనుగుణంగా నడచుకోవాలని యూజీసీ స్పష్టం చేసిందని పెటా ఇండియా శాస్త్ర విధా న సలహాదారు డాక్టర్ చైతన్య కోడూరి వివరించారు.

0 comments:

Post a Comment