Thursday

అంతరిక్ష నిఘా వ్యవస్థ పరీక్ష విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అంతరిక్ష నిఘావ్యవస్థను డీఆర్‌డీవో తొలిసారిగా వి జయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో త యారైన వైమానిక ముందస్తు హెచ్చరిక మరియు ని యంత్రణ వ్యవస్థ (ఏఈడబ్ల్యూఅండ్‌సీ)ను డీఆర్‌డీవో, బ్రెజిల్‌లోని సావోజోస్ దాస్ క్యాంపోస్ వద్ద పరీక్షించిం ది.

ఈ వ్యవస్థకు చెందిన విడిభాగాలను బెంగళూరు డీ ఆర్‌డీవో లాబ్ అందించిందని ప్రతినిధి ఒకరు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష నిఘా వ్యవస్థను రూపొందించడం గొప్ప మైలురాయని డీఆర్‌డీవో చీఫ్ సరస్వత్ అన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, 2 నిఘా విమానాలను వచ్చే యేట విడుదల చేస్తామన్నారు.

0 comments:

Post a Comment