Pages

Saturday

ఆ వైపు చూడనంటోన్న కాజల్


వెండి తెరపై కథానాయికలు కనువిందు చేసేది కొంత కాలమే. అందుకే వాళ్లు అవకాశాల కోసం అంతగా ఆరాటపడుతుంటారు ... బ్యాంకు బ్యాలన్స్ పెంచుకోవడానికి పోటీ పడుతుంటారు. ప్రస్తుతం ఈ పనిలో కాజల్ అగర్వాల్ చాలా బిజీగా వుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసేయగానే బాలీవుడ్ ని దున్నేయాలనుకునే ఈ రోజుల్లో, అసలు అటువైపే చూడనంటోంది కాజల్. అయితే, అక్కడ కాజల్ నటించిన 'సింఘం' సక్సెస్ అయినా ఆమెకి గుర్తింపు రాకపోవడమే అందుకు ప్రధాన కారణమని అంటున్నారు. దాంతో ఈ పంజాబీ పడుచు ఉత్తరాది పై ఊహలు మానేసి దక్షణాది పైనే దృష్టి పెట్టింది. రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతోన్న సమంతా -  తమన్నాలతో పోటీ పడి మరీ అవకాశాలు దక్కించుకొంటోంది. ఇక పై తెలుగు- తమిళ చిత్రాలపై మరింత శ్రద్ధ పెడతానంటోన్నకాజల్ అగర్వాల్, తెలుగులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ సరసన ...  తమిళంలో సూర్య - విజయ్ ల సరసన నటిస్తోంది. పవన్ కళ్యాన్ తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా కూడా కమిట్ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.

No comments:

Post a Comment