Pages

Monday

మైనపు బొమ్మగా మారుతున్న మాధుర్యం...!


కొన్నేళ్ల పాటు ప్రేక్షకులని తన అందచందాలతో, అభినయ సౌందర్యంతో ఉర్రూతలూగించిన నిన్నటి బాలీవుడ్ కథానాయిక మాధురీ దీక్షిత్ లండన్ లోని మేడం టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో కొలువుదీరనుంది. ఆమె మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో మార్చ్ 7 న ఆవిష్కరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్తమానం మాధురీ దీక్షిత్ కి సదరు మ్యూజియం నుంచి అందింది. ఈ మైనపు బొమ్మ తయారుకావడానికి నాలుగు నెలల సమయం పట్టింది. సుమారు లక్షా ఏభై వేల పౌండ్లు వ్యయం అయింది. నిజం చెప్పాలంటే, ఆ మ్యూజియంలో మాధురి బొమ్మ పెట్టడం ఇప్పటికే ఆలస్యం అయింది. ఆమె జూనియర్లయిన షారుఖ్, సల్మాన్, హృతిక్, ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారల మైనపు బొమ్మలు ఇప్పటికే అక్కడ కొలువుదీరాయి.

No comments:

Post a Comment