Pages

Saturday

'దమ్ము' కోసం యన్టీఆర్, త్రిషల పాట


యన్టీఆర్ ఫైట్లు చేసి చేసి... కాస్త రిలీఫ్ కోసం ఇప్పుడు పాటల్లో పడ్డాడు. అవును... 'దమ్ము' సినిమా కోసం త్రిషతో కలిసి ప్రస్తుతం తను డ్యూయెట్లు పాడుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు గత కొన్ని రోజుల నుంచీ తమిళనాడులోని పొల్లాచి ప్రాంతంలో జరుగుతోంది. యన్టీఆర్, కొందరు ఫైటర్లు పాల్గొనగా ముందుగా ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. అనంతరం ఇప్పుడు ఓ పాటను శంకర్ మాస్టర్ నృత్య సారధ్యంలో యన్టీఆర్, త్రిషలపై చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందనీ, దాంతో ఇక కొంత టాకీ పార్ట్ తో బాటు మరో రెండు పాటల షూటింగు మిగిలి ఉంటుందనీ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పొల్లాచ్చి నుంచి రాగానే ఈ చిత్రీకరణ పూర్తి చేస్తారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేస్తారు. 

No comments:

Post a Comment