Pages

Tuesday

మంగళూరు విమాన ప్రమాద పరిహారం కేసు..


మంగళూరులో 2010 మే నెలలో జరిగిన విమాన ప్రమాదం మృతుల కుటుంబాలకు పరిహారం కేసులో ఎయిర్ ఇండియాకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన 158 మంది ప్రయాణికులకు సంబంధించి ప్రతి ఒక్కరికీ రూ.75లక్షల వంతున పరిహారం చెల్లించాలంటూ దాఖలై పిటిషన్‌పై సుప్రీం ఈ నోటీసులు జారీ చేసింది.

దీనిపై తమ తమ జవాబులు కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని, ఎయిర్ ఇండియాను ఆదేశించిన జస్టిస్ దల్వీర్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం.. కేసు విచారణను వాయిదా వేసింది.

No comments:

Post a Comment